మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అల్లు అర్జున్. గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయం అయినా..తర్వాత దేశముదురు, బన్ని, ఆర్య సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. సరైనోడు, దువ్వాడ జగన్నాధం మంచి విజయం సాధించిన తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' తో అభిమానుల ముందుకు వస్తున్నాడు. రచయిత వక్కంతం వంశీ తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్న మూవీ ‘నా పేరు సూర్య’. ఈ మూవీ అల్లు అర్జున్ హీరో, అనూ ఇమాన్యుయేల్ హీరోయిన్.. ఈ మూవీలో అల్లు అర్జున్ ఆర్మీ అధికారిగా నటించనున్నాడు.. మే 4వ తేదిన ప్రేక్షకలు ముందుకురానుందీ.
సినిమా మొత్తం మిలటరీ ట్రైనింగ్, సరిహద్దులో సైనికులు చేసే పోరాటం లాంటి అంశాలతో తెరకెక్కుతోంది. మే 4న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. విడుదల సమయం దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ వేగం పుంజుకోనున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ ఇంపాక్ట్, డైలాగ్ ఇంపాక్ట్, ట్రైలర్లు సినిమాపై అంచనాలు మరింత పెంచాయి. ఏప్రిల్ 29న భారీ ఎత్తున ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో పాటు మరో ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది.
మిలటరీ నేపథ్య మూవీ కావడంతో ఆడియో రిలీజ్ వేడుకను పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం సమీపంలోని ‘మిలటరీ మాధవరం’ లో జరపాలని నిర్ణయించింది చిత్ర యూనిట్.. ఈ ఊళ్లో ఒక్కో కుటుంబం నుంచి ఒకరు ఆర్మీలో ఉన్నారు. దీంతో ఆ గ్రామస్తుల సమక్షంలోనే ఆడియో రిలీజ్ చేయనున్నారు. గత కొంత కాలంగా మెగా ఫ్యామిలీలో వివాదాలు వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ, ఈ మద్య ఫ్రీ రిలీజ్ ఫంక్షన్లలో అందరు మెగా హీరోలు ఒకే వేదికపైకి వస్తున్నారు. ఈ మద్య రంగస్థలం సక్సెస్ మీట్ లో పవన్ కళ్యాన్ ముఖ్య అతిధిగా విచ్చేశారు. రాజకీయాలు వేరు వేరు అయినా..మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటే అన్నారు.
ఇక అల్లు అర్జున్ కి మామ చిరంజీవి అంటే వల్లమాలిన అభిమానం. బన్నీకి చిన్న సర్ప్రైజ్ ఇచ్చారు చిరు. వివరాల్లోకి వెళితే..బన్ని నటిస్తున్న తాజా చిత్రం 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'కి సంబంధించి.. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్లో ఓ మాస్ డ్యూయెట్ను చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా.. చిరు ఆ సెట్కు వచ్చి చిత్ర యూనిట్కు సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ సమయంలో.. చిత్ర బృందంతో చిరు దిగిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.