టాలీవుడ్ ఇండస్ట్రీలో అప్పట్లో నాగేశ్వరరావు, శోభన్ బాబు ల తర్వాత ఇద్దరు హీరోయిన్లతో నటిస్తూ..రొమాంటిక్ హీరో, ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు జగపతిబాబు. అయితే జగపతిబాబు ఎన్ని సినిమాల్లో నటించిన పెద్దగా గుర్తింపు మాత్రం రాలేదు. దాంతో సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన ఆయన బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ‘లెజెండ్’ సినిమాతో విలన్ గా యూ టర్న్ తీసుకున్నారు. ఏ ముహూర్తంలో విలన్ గా ఎంట్రీ ఇచ్చాడో..జగపతిబాబుకి బాగా కలిసి వస్తుంది. తెలుగు, తమిళంలోనే కాకుండా ఆ మద్య మళియాళంలో కూడా అడుగు పెట్టారు.
ఈ మద్య రిలీజ్ అయిన రంగస్థలం సినిమలో ప్రెసిడెంట్ గా నటించి మెప్పించారు. ఆ మద్య రాజకీయాల గురించి మాట్లాడుతూ..తంలో కొందరు రాజకీయాల్లోకి ఆహ్వానించారని, అయితే తనకు అలాంటి ఆలోచనలేదని వాళ్లని చెప్పినట్లు తెలిపారు. ప్రత్యేక హోదా ఉద్యమానికి చిత్ర పరిశ్రమ మద్దతిస్తోందని, అవసరమొచ్చినప్పుడు తామంతా పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని జగపతి వెల్లడించారు.
తాజాగా ఇప్పుడు జగపతిబాబు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదీ సల్మాన్ సినిమాలోనని టాక్. సల్మాన్ హీరోగా చేసిన 'దబాంగ్' .. 'దబాంగ్ 2' సినిమాలు ఆయన అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అప్పటి నుంచి వాళ్లు 'దబాంగ్ 3' కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుదేవా దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుందనేది తాజా సమాచారం.
రంగస్థలంలో జగపతిబాబు నటించిన ప్రెసిడెంట్ పాత్రను చూసిన సల్మాన్ తన మూవీలో జగపతిబాబు పేరును సూచించినట్లు సమాచారం.. అలాగే ప్రభుదేవాతో కూడా జగపతిబాబుకి మంచి రేపోర్ట్ ఉండటంతో దబాంగ్ 3 తో జగ్గుబాయి బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు.. బాలీవుడ్ లో అడుగు పెట్టాలనే జగపతిబాబు కల ఈ విధంగా నెరవేరనుంది.ఇక జగపతిబాబు విలన్ గా బాలీవుడ్ లో ఏ స్థాయిలో విజృంభిస్తాడో చూడాలి.