ప్రముఖ దర్శకులు శేఖర కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ‘ఫిదా’ మంచి విజయం సాధించింది. చిన్న సినిమాగా తెరకెక్కిన ‘ఫిదా’ బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాకుండా కలెక్షన్లు కూడా బాగా రాబట్టింది. అయితే ఈ సినిమాలో నటించిన సాయి పల్లవి తెలంగాణ యాసలో అమాయకంగా మాట్లాడే మాటలకు తెలుగు రాష్ట్ర ప్రజలు ఫిదా అయ్యారు. వాస్తవానికి సాయి పల్లవి తెలుగు బుల్లితెరపై డ్యాన్స్ షో ద్వారా ఎంట్రీ ఇచ్చింది. కానీ అప్పట్లో పెద్దగా గుర్తింపు రాలేదు..ఆ తర్వాత మళియాళంలో ‘ప్రేమమ్’ సినిమాతో హీరోయిన్ గా నటించింది.
Image result for sai pallavi
ఆ సినిమా మంచి హిట్ కావడంతో శేఖర్ కమ్ముల ‘ఫిదా’ సినిమాలో తీసుకున్నారు.  సాయిపల్లవి నటన..చలాకీతనం..తెలంగాణ యాసతో మాట్లాడటం.. సినిమాకు మంచి హైలెట్ గా నిలిచాయి.  ఈ సినిమా విజయం తర్వాత వరుసగా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో చాన్సులు రావడం మొదలయ్యాయి.
Image result for sai pallavi
తెలుగు .. తమిళ భాషల్లో సాయిపల్లవికి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. తన పాత్రకి ప్రాధాన్యత .. ఆ పాత్రకి ఓ వ్యక్తిత్వం ఉంటేనే చేయడానికి సాయిపల్లవి అంగీకరిస్తుంది. పాత్ర నచ్చకపోతే రెమ్యునరేషన్ ద్వారా సాయిపల్లవిని ఒప్పించలేమనే విషయం ఇప్పటికే దర్శకనిర్మాతలకు అర్థమైపోయింది.స్టార్ హీరోయిన్ హోదాను చూపించడం కన్నా .. కుటుంబసభ్యులతో కలిసి సాధారణంగా జీవించడంలోనే అసలైన ఆనందం ఉంటుందనేది ఆమె అభిప్రాయం. 
Image result for sai pallavi fidaa
తాజాగా సాయి పల్లవి తల్లి రాధా కన్నన్ ..చెల్లెలు పూజా కన్నన్ తో సాయిపల్లవి దిగిన ఈ సెల్ఫీ అదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. సోషల్ మీడియాలోను .. సినిమా ఫంక్షన్స్ లోను ఎక్కువగా కనిపించని సాయిపల్లవి, సాధారణమైన జీవితాన్ని ఇష్టపడటం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం.    



మరింత సమాచారం తెలుసుకోండి: