ఎన్నాళ్లో వేచిన ఉదయం..ఈనాడే..ఎదురౌతుంటే..అన్న విధంగా ప్రిన్స్ మహేష్ బాబు కి దారుణమైన డిజాస్టర్స్ తర్వాత ‘భరత్ అనే నేనూ’ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. గతంలో కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీమంతుడు’ మంచి విజయం సాధించింది. ఈ సినిమా కమర్షియల్ హిట్ కావడమే కాదు..రూ.150 కోట్ల క్లబ్ లో చేరింది. ఆ తర్వాత వచ్చిన ‘బ్రహ్మోత్సవం’, ‘స్పైడర్’ దారుణంగా అపజయం పొందాయి. మరోసారి కొరటాల శివ దర్శకత్వంలో పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ‘భరత్ అనే నేనూ’ రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో పాజిటీవ్ టాక్ తెచ్చుకుని ఘనవిజయం సాధించింది.
సరైన విజయం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న మహేష్ బాబు అండ్ టీమ్ సంబరాలు జరుపుకుంటున్నారు. మొన్నటి వరకు రికార్డుల మోత మోగిస్తూ వస్తున్న రంగస్థలం కలెక్షన్లు కూడా ఈ సినిమా బీట్ చేస్తుంది. ఇదిలా ఉంటే..విడుదలైన రెండు రోజుల్లోనే ఈ చిత్రం రూ. 100 కోట్ల క్లబ్ లో చేరిందని అంటూ యూనిట్ ఓ ప్రకటన రిలీజ్ చేసింది.బాహుబలి తర్వాత ఇలా రిలీజైన రెండు రోజుల్లోనే ఇంత భారీ వసూళ్లు సాధించిన రెండో సినిమాగా నిలిచిందని పేర్కొంది.
తొలిరోజు మహేష్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన ఈ సినిమా అమెరికాలో రెండు రోజుల్లో రెండు మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించింది.సినిమా 100 కోట్ల క్లబ్లో చేరిన విషయాన్ని చిత్ర నిర్మాత డివివి ప్రోడక్షన్స్ తన ట్వీట్టర్ ద్వారా తెలిపారు. ఇప్పట్లో మరో పెద్ద సినిమా లేకపోవడంతో మహేష్ సినిమాకు బాక్సాఫిస్ దగ్గర తిరుగు లేదు. శ్రీమంతుడు చిత్రం తరువాత మహేష్-కొరటాల కాంబోలో వచ్చిన ఈ మూవీ అంచనాలకు తగ్గ సక్సెస్ సాధించింది.