మెగా ఫ్యాన్స్ అంతా గరం గరంగా ఉన్న ఈ టైంలో రాబోతున్న నా పేరు శివ సినిమా ప్రమోషన్స్ కూడా ప్లాన్ చేస్తున్నాడు అల్లు అర్జున్. ఓ పక్క పవన్ ఇష్యూ చాలా సీరియస్ గా నడుస్తుండగా రీసెంట్ గా జరిగిన నా పేరు సూర్య ఆడియోలో బన్ని కూడా పవన్ కు సపోర్ట్ గా మాట్లాడి ఫ్యాన్స్ ను ఉత్సాహపరిచాడు.


ఇక త్వరలోనే మరో మెగా ఈవెంట్ ఉంటుందని అన్నారు. అదే నా పేరు సూర్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 29న గచ్చిబౌలిలో జరుగనుంది. ఈ ఈవెంట్ కు మెగా హీరోలంతా మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటుగా రాం చరణ్, బన్ని, వరుణ్ తేజ్, సాయి ధరం తేజ్, అల్లు శిరీష్ ఇలా అందరు వస్తారని అన్నారు.


అయితే ప్రస్తుతానికైతే రాం చరణ్ ఒక్కడే వస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. వక్కంతం వంశీ డైరక్షన్ లో వస్తున్న నా పేరు సూర్య సినిమాలో అల్లు అర్జున్ ఓ యాంగ్రీ సోల్జర్ గా కనిపిస్తున్నాడు. విశాల్ శేఖర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని సాంగ్స్ కు మంచి రెస్పాన్సే వచ్చింది.


మే 4న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న నా పేరు సూర్యతో అల్లు అర్జున్ మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. రాం చరణ్ ఒక్కడే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వస్తాడా లేక మెగా ఫ్యామిలీ మొత్తం కదిలి వస్తునా అన్నది త్వరలో తెలుస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: