దర్శకులు సుకుమార్, రాంచరణ్ కాంబినేషన్ లో వచ్చిన ‘రంగస్థలం’ ఇప్పుడు టాలీవుడ్ లో సంచలనాలు సృష్టిస్తుంది.  మొన్నటి వరకు బాహుబలి 2 సాధించిన రికార్డుల గురించి వింటూ వచ్చాం..ఇప్పుడు రాంచరణ్ నటించిన ‘రంగస్థలం’ సినిమా రికార్డులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే రూ.200 కోట్ల క్లబ్ లో చేరినట్లు చిత్రయూనిట్ తెలిపింది.  ఈ సినిమా విజయోత్సవాన్ని ఆనందిస్తున్న సమయంలోనే చరణ్ మరో సినిమాకు కమిట్ అయిన విషయం తెలిసిందే. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో  చరణ్ హీరోగా ఒక సినిమా రూపొందుతోంది. 
Image result for rangastlam movie
యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో కథానాయికగా కైరా అద్వాని నటిస్తోంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ మద్యనే రెండవ షెడ్యూల్ కూడా మొదలు పెట్టారు. కాగా, ఈ షెడ్యూల్ లో రాంచరణ్ నటిస్తున్నారు.  ఈ నేపథ్యంలో ఈ సినిమాకి 'రాజ వంశస్థుడు' .. 'రాజమార్తాండ' అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి.

అయితే ఇంతవరకూ ఈ సినిమాకి ఏ టైటిల్ ను ఫిక్స్ చేయలేదనేది చిత్ర సన్నిహితవర్గాలు అంటున్నారు. రంగస్థలం సాధించిన విజయాన్ని దృష్టిలో పెట్టుకొని తన తదుపరి సినిమాపై ఎక్కువ ఫోకస్ పెడుతున్న రాంచరణ్ ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. . త్వరలోనే టైటిల్ ను ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. విలన్ గా వివేక్ ఒబెరాయ్ నటన ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.    


మరింత సమాచారం తెలుసుకోండి: