టాలీవుడ్ లో ప్రముఖ దర్శకులు రామానాయుడు తనయుడు వెంకటేష్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు.  మొదట యాక్షన్ తరహా సినిమాల్లో నటించినా..తర్వాత ఫ్యామిలీ, కామెడీ సినిమాల్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నారు.  ఇప్పటి వరకు ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ పై ఎలాంటి కాంట్రవర్సీలు రాలేదు. పైగా ఇలాంటి వాటికి ఆయన చాలా దూరంగా ఉంటారని..తన పని తాను చేసుకుంటూ వెళ్తారని టాక్.  క్రికెంట్ అంటే ఎంతో పిచ్చిగా ప్రేమిస్తారని తెలిసిందే. 

ఆ మద్య ‘గురు’ సినిమాలో బాక్సర్ కోచ్ గా తన నట విశ్వరూపాన్ని చూపించారు.  ఇప్పటి వరకు వెంకటేష్ తెలుగు హీరోలు మహేష్, పవన్ కళ్యాన్, రామ్ లతో మల్టీస్టారర్ సినిమాల్లో నటించారు. త్వరలో మెగా హీరో వరుణ్ తేజ్ తో కూడా ఓ సినిమాలో నటిస్తున్నారు. క్రిడలను ఎంతగానో అభిమానించే వెంకటేష్ చిన్నారులతో కలిసి హీరో వెంకటేష్ సరదాగా కాసేపు బ్యాడ్మింటన్ ఆడాడు.. రోడ్డుపై బ్యాడ్మింటన్ ఆడుకుంటున్న చిన్నారుల వద్దకు వెళ్లి తనూ వారితో జత కలిపాడు. ఊహించని ఈ సంఘటనతో చిన్నారులు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు.

ఈ దృశ్యాన్ని సెల్ ఫోన్లలో చిత్రీకరించారు.ఊహించని ఈ సంఘటనతో చిన్నారులు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు. ఈ దృశ్యాన్ని సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. వెంకటేష్ తో కలిసి సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి కనబరిచారు. అనంతరం, తన వాహనంలో వెంకటేష్ వెళ్లిపోయాడు. అయితే, ఈ సరదాగా సంఘటన ఏ ఏరియాలో జరిగిందో తెలియదు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలకు చేరి వైరల్ గా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: