‘బద్రి’ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన పూరి జగన్నాధ్ తర్వాత ఇడియట్ సినిమాతో మంచి మాస్ ఫాలోయింగ్ సంపాదించారు. ఆ తర్వాత మహేష్ బాబు తో తీసిన ‘పోకిరి’ పూరి ఇమేజ్ ని ఎక్కడికో తీసుకు వెళ్లింది. స్టార్ డైరెక్టర్ గా మంచి ఫామ్ లో ఉన్న పూరి జగన్నాధ్ జయాపజయాలతో సంబంధం లేకుండా తన పని తాను చేసుకుంటూ పోతారు. ఇండస్ట్రీలో పూరీ జగన్నాథ్ నుంచి ఒక సినిమా వస్తుందీ అంటే .. మాస్ ఆడియన్స్ కి పండగే. అందుకే వాళ్లంతా ఆయన తాజా చిత్రమైన 'మెహబూబా' కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తన తనయుడు ఆకాశ్ పూరీ హీరోగా .. తనే దర్శక నిర్మాతగా ఈ సినిమాను పూరీ రూపొందించాడు. ఈ సినిమా కోసం ఆయన తనకి గల ఇళ్లలో నుంచి ఒక ఇంటిని అమ్మేసినట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది.తన కొడుకును మొదటి సినిమాతోనే స్టార్ను చేయాలనే ఉద్దేశ్యంతో కాస్త ఎక్కువ బడ్జెట్ను పెట్టడం జరిగింది. ఇతర నిర్మాతలు కొత్త హీరోపై ఎక్కువ బడ్జెట్ పెట్టేందుకు ఆసక్తి చూపించరు.
అందుకే తాను స్వయంగా భారీ బడ్జెట్తో ఆకాష్తో సినిమాను చేశాను అని, సినిమా నిర్మాణం కోసం అందరు అనుకుంటున్నట్లుగా నిజంగానే తన ఇల్లు అమ్ముకున్నాను అని, అయితే సినిమా విడుదలైన తర్వాత తప్పకుండా తాను పడ్డ కష్టంకు ప్రతిఫలం దక్కుతుందనే నమ్మకం ఉందని పూరి చెప్పుకొచ్చాడు. . ఈ సినిమా కంటెంట్ మీద .. ఆకాశ్ మీద నాకు నమ్మకం వుంది .. అందుకే అలా చేశాను.
ఇలాంటి వాటి గురించి నేను పెద్దగా ఆలోచించను .. ఏదైనా తిరిగి సంపాదించుకోవడమెలాగో నాకు తెలుసు" అని చెప్పుకొచ్చారు. ఈ చిత్రాన్ని నైజాం ఏరియాకు గానే దిల్రాజు తీసుకోవడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. మరి పూరి నమ్మకంను ఈ చిత్రం నిలిపేనా, పూరికి ఆర్థికంగా మద్దతుగా సక్సెస్ దక్కేనా అనేది చూడాలి.