మాటల మాంత్రికుడు త్రివిక్రం, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఇద్దరు కలిసి చేస్తున్న సినిమా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమాకు టైటిల్ ఏంటన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. రకరకాల పేర్లు వినిపిస్తున్నా ఫైనల్ గా ఇండస్ట్రీ వర్గాల నుండి ఈ సినిమా టైటిల్ ఇదే అని చెబుతున్నారు.


ఇంతకీ త్రివిక్రం, తారక్ ఏ టైటిల్ కు లాక్ అయ్యారు అంటే. అసామాన్యుడు అని తెలుస్తుంది. కచ్చితంగా ఈ సినిమా టైటిల్ ఎన్.టి.ఆర్ కు పర్ఫెక్ట్ అనిపించక మానదు. అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రం డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఎన్.టి.ఆర్ క్రేజ్ ను మరింత పెంచేదిగా ఉంటుందని చెబుతున్నారు.


ఇప్పటిదాకా మహేష్, పవన్, అల్లు అర్జున్ లతో సినిమాలను చేసిన త్రివిక్రం కెరియర్ లో మొదటిసారి ఎన్.టి.ఆర్ ను డైరెక్ట్ చేస్తున్నాడు. ఎన్.టి.ఆర్ కు ఉన్న మాస్ ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకుని మరి త్రివిక్రం ఎన్.టి.ఆర్ కు తగిన కథ రాసుకున్నట్టు తెలుస్తుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. 


ఇక ఈ సినిమాలో డిజే భామ పూజా హెగ్దెతో పాటుగా సాహో బ్యూటీ శ్రద్ధా కపూర్ కూడా నటిస్తుంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలవగా ఈ ఇయర్ దసరా కల్లా సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. మరి అసామాన్య ప్రతిభ గల త్రివిక్రం, ఎన్.టి.ఆర్ ఎలాంటి సినిమాతో వస్తారో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: