ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో వరుసగా ప్రేమ వివాహాలు జరుగుతున్నాయి. రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటున్నారు. తెలుగులో ‘ఏం మాయ చేసావే’ సినిమాతో పరిచయం అయిన అక్కినేని నాగ చైతన్య, సమంత కొంత కాలం ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి గోవాలో పెళ్లి చేసుకున్నారు.  ఇక బాలీవుడ్ లో చాలా కాలం పాటు చెట్టా పట్టాలేసుకొని తిరిగిన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ వివాహబంధంతో ఒక్కటయ్యారు. అంతే కాదు రణవీర్ సింగ్, దీపికా పదుకొనె కూడా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
Related image
తాజాగా మరో సినిమా జంట త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.  సూపర్ స్టార్ మహేష్ నటించిన 1 నేనొక్కడినే చిత్రంతో కృతి సనన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 1 నేనొక్కడినే చిత్రం విజయం సాధించకపోయినా కృతి సనన్ కు మంచి గుర్తింపు తీసుకుని వచ్చింది. ఆ తరువాత ఈ భామ బాలీవుడ్ కు వెళ్ళిపోయింది.   నటి కృతి సనన్‌, సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌లు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నట్లు అప్పట్లో వార్తలు వెలువడ్డాయి.
 ఫ్యామిలీతో సుశాంత్ ఇంటికి
వీరిద్దరూ రాబ్తా చిత్రంలో కలిసి నటించారు. ఈ సినిమా సమయంలోనే వీరు ప్రేమించుకున్నారని గతంలో గాసిప్స్ వినిపించాయి. ఆదివారం రోజు కృతి సనన్ తన ఫ్యామిలీతో సుశాంత్ ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. వీరి పెళ్లి గురించి చర్చించడానికే ఇరు కుటుంబ సభ్యులు కలసినట్లు బలంగా వార్తలు వినిపిస్తున్నాయి.
Image result for raabta kriti sanon
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా షో రూమ్ కృతి, సుశాంత్ కలసి వెళ్లడం కూడా పెళ్లి వార్తలు బలపడడానికి కారణం.కృతి సనన్ తన ఫ్యామిలీతో సుశాంత్ ఇంటికి వెళ్లిన ఫోటోలని ప్రముఖ ఫోటో గ్రాఫర్ వైరల్ భయాని తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: