ఈ వేసవి కానుకగా ప్రజల ముందుకు విడుదలయిన రంగస్థలం ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. తొంభైల్లోని గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలోని రాంచరణ్ నటనకు అందరూ మెచ్చుకున్నారు కూడా. అయితే రంగస్థలం సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న చరణ్ కు ఒక ప్రముఖ నిర్మాత చేసిన పని తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించిందని ఇండస్ట్రీ మొత్తం కోడై కూస్తోంది.


వివరాల్లోకి వెళితే భరత్ అను నేను నిర్మాత డివివి దానయ్య ఆ సినిమా రెండువందల కోట్లను సాధించినట్లుగా కొత్తగా పోస్టర్లను తయారుచేయించాడంట. రంగస్థలం ఇంకా థియేట్రికల్ రన్ పూర్తి అవకుండానే డివివి దానయ్య ఈ పోస్టర్లు తయారుచేయించడం చెర్రీకి కోపాన్ని తెప్పించిందని సమాచారం. ఇంకా కొన్ని చోట్ల రంగస్థలం విజయవంతంగా ఆడుతుండడంతో ఈ పోస్టర్లు ఇప్పుడే అవసరమా అని చెర్రీ ఫీల్ అవుతున్నాడని టాక్.


ఇదే విషయంపైన దానయ్యకి చెర్రీ ఫోన్ చేసి మాట్లాడాడని సమాచారం. రంగస్థలం దాటించడానికోసం ఇలాంటి ఫేక్ కలెక్షన్ల పోస్టర్ల అవసరం ఏంటని చెర్రీ ఆయనను నిలదీశాడంట. ఆయన మీద కోపం వల్లే రెండురోజులు షూటింగు కి కూడా హాజరుకాలేదని వార్తలు వస్తున్నాయి. అన్నట్లూ చెర్రీ హీరోగా బోయపాటితో పాటు రాజమౌళి నిర్మిస్తున్న ముల్టీస్టారర్ రెండు సినిమాలకు దానయ్య నిర్మాత కావడం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: