నాగ్ అశ్విన్ డైరక్షన్ లో వచ్చిన మహానటి మూవీ సావిత్రి బయోపిక్ గా వచ్చిన సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్నా సినిమాస్ బ్యానర్లో ప్రియాంకా దత్ నిర్మించారు. మే 9న రిలీజ్ అయిన ఈ సినిమా అన్నిచోట్ల సూపర్ హిట్ టాక్ అందుకుంది.


ఇక ఈ సినిమాతో బయోపిక్ లను తీయలనుకునేవారికి గట్టి టార్గెట్ పెట్టింది. ఇప్పటికే ఎన్.టి.ఆర్ బయోపిక్ గా బాలకృష్ణ ఎన్.టి.ఆర్ సినిమా మొదలు పెట్టాడు. తేజ డైరక్షన్ లో మొదలైన ఆ సినిమా సగంలో ఆపేసి నా వల్ల కాదని చెప్పాడు. ఇక ఆ సినిమాకు దర్శకుడిని వెతికే పనిలో పడ్డాడు బాలకృష్ణ.


మరోపక్క వై.ఎస్.ఆర్ బయోపిక్ గా యాత్ర సినిమా కూడా వస్తుంది. మహి వి రాఘవ్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా కూడా భారీగానే వస్తుంది. బయోపిక్ అంటే మహానటి అని చెప్పుకునేలా దర్శకత్వ ప్రతిభ చాటుకున్న నాగ్ అశ్విన్ బయోపిక్ సినిమాలకు పెద్ద టార్గెట్ ఇచ్చాడు. ఇవి రెండే కాదు మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సైరా నరసింహారెడ్డి కూడా స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రతోనే వస్తుంది.


సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి బయోపిక్ అంటే చిన్న చూపు చూసే వారికి మహానటి షాక్ ఇవ్వగా రానున్న ఈ బయోపిక్ సినిమాలు ప్రేక్షకులకు ఎలాంటి అనుంభూతిని ఇస్తాయో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: