సూపర్ స్టార్ మహేష్ లేటెస్ట్ ట్రెండ్ సెట్టర్ మూవీ భరత్ అనే నేను సక్సెస్ తో ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. అందుకే సినిమా రిలీజ్ తర్వాత రెగ్యులర్ గా వెళ్లే ఫ్యామిలీ ఫారిన్ ట్రిప్ కు వెళ్లాడు. కొద్దిరోజులుగా సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న మహేష్ ప్రస్తుతం ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక తర్వాత తన 25వ సినిమాపై దృష్టి పెట్టనున్నాడు.


వంశీ పైడిపల్లి డైరక్షన్ లో ఈ సినిమా ఉండబోతుంది. దిల్ రాజు, అశ్వనిదత్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా వస్తుందని అన్నారు. అయితే కొన్నాళ్లుగా మహేష్ రెగ్యులర్ సింపుల్ అండ్ కూల్ క్యారక్టరైజేషన్ లోనే కనిపిస్తున్నాడు. పోకిరి లాంటి పాత్రలో చూడాలని అనుకుంటున్నారు అభిమానులు.


అందుకే వంశీ పైడిపల్లి సినిమా ఓవరాల్ గా ఫ్యామిలీ సినిమా అయినా సినిమాలో తన పాత్ర మాత్రం మాస్ క్యారక్టరైజేషన్ అని తెలుస్తుంది. ఈమధ్యనే ఈ సినిమా గురించి ప్రస్థవిస్తూ తన లుక్ కూడా కొత్తగా ఉండబోతుందని చెప్పాడు మహేష్. స్టార్ హీరోలకు మాస్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది.


అయినా సరే మహేష్ వారి కోసమే కాకుండా అందరు మెచ్చే సినిమా చేస్తున్నాడు. ఇక పక్కా మాస్ ఆడియెన్స్ కోసం సినిమా చేస్తే ఆ లెక్క వేరేలా ఉంటుంది. వంశీ పైడిపల్లి సినిమా అలాంటి మాస్ ఆడియెన్స్ ను దృష్టిలో ఉంచుకునే చేస్తున్నాడట. ఊపిరి తర్వాత మహేష్ కోసం రెండేళ్లు వెయిట్ చేసిన వంశీ పైడిపల్లి మహేష్ తో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: