స్టార్ సినిమా హిట్ అయితే ఓ లెక్క ఫ్లాప్ అయితే మరో లెక్క. టీజర్ నుండి వసూళ్ల వరకు స్టార్స్ మధ్య ఫైట్ అందరికి తెలిసిందే. ఇక ఒకేసారి రెండు సినిమాలు సూపర్ హిట్ టాక్ వస్తే దర్శక నిర్మాతలు చేసే హంగామా కన్నా మీడియా చేసే హడావిడి వేరేలా ఉంటుంది. లేటెస్ట్ గా అదే సీన్ రిపీట్ అయ్యింది.


ధ్రువ తర్వాత మెగా పవర్ స్టార్ రాం చరణ్ రంగస్థలం బ్లాక్ బస్టర్ హిట్ అవగా ఆవెంటనే వచ్చిన సూపర్ స్టార్ మహేష్ భరత్ అనే నేను కూడా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. రెండు వేరే కథలు.. వేరే కాన్సెప్టులు. భరత్ కన్నా రంగస్థలం కలక్షన్స్ లెక్క ఎక్కువే. అయితే మీడియా వల్ల రెండు సమానమైన హిట్లు అన్న విధంగా టాక్ ఉంది.


రంగస్థలం అధికారికంగా 200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. భరత్ అనే నేను నిర్మాత దానయ్య 190 కోట్ల గ్రాస్ అని ప్రకటించాడు. అయితే ఇప్పటికే రాం చరణ్ దానయ్యకు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అంతేకాదు మీడియా మీద కూడా చరణ్ ఫైర్ అయ్యాడట. రెండు సూపర్ హిట్లు కొట్టినప్పుడు రెండిటిని పోల్చడం ఎందుకని అన్నాడట.


రంగస్థలం తనకు హిట్, భరత్ అనే నేను మహేష్ కు హిట్.. అనవసరమైన పోలికతో అభిమానుల మధ్య గొడవలు వస్తాయని అన్నాడట. అంతేకాదు మహేష్ తనకు మంచి స్నేహితుడని తనకు హిట్ వచ్చినందుకు తాను సంతోషంగా ఉన్నానని చెప్పాడట. రంగస్థలం, భరత్ ఈ రెండిటిలో ఏది పెద్ద హిట్ అన్న డిస్కషన్స్ వదిలి రెండు సూపర్ హిట్లు అన్న విధంగా ప్రమోట్ చేస్తే మంచిదని అభిప్రాయపడ్డాడట రాం చరణ్. చరణ్ చెప్పింది కూడా పాయింటే కదా అని కొందరంటున్నారు.    



మరింత సమాచారం తెలుసుకోండి: