ఈ మద్య హైదరాబాద్ లో డ్రంకెన్ డ్రైవ్‌లో సెలబ్రెటీలు, పొలిటీషియన్స్, డాక్టర్, పారిశ్రామిక వేత్తలు అడ్డంగా బుక్ అవుతున్న విషయం తెలిసిందే.  ఆ మద్య యాంకర్ ప్రదీప్ డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుపడ్డారు.  ఈ విషయం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది.  తాజాగా శనివారం అర్థరాత్రి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్‌ తనిఖీల్లో 96 మంది పట్టుబడ్డారు.

ఈ తనిఖీల్లో టాలీవుడ్ నటుడు కిరీటి దామరాజు అడ్డంగా బుక్కయ్యారు. మరో ఇద్దరు అమ్మాయిలు కూడా డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికేశారు. నటుడు కిరీటి దామరాజు ఉయ్యాలా జంపాలా, సెకండ్ హ్యాండ్, మీకు మీరే మాకు మేమే, ఉన్నది ఒకటే జిందగీ, మెంటల్ మదిలో, చల్ మోహన రంగా తదితర చిత్రాల్లో నటించారు. ఈ తనిఖీల్లో భాగంగా 39 కార్లు, 57 ద్విచక్రవాహానను స్వాధీనం చేసుకున్న పోలీసులు, వారిపై కేసులు నమోదు చేశారు.

పట్టుబడ్డవారికి కౌన్సెలింగ్ ఇచ్చి, ఆపై కోర్టు ముందు హాజరు పరుస్తామని ఓ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. జూబ్లీహిల్స్ పరిధిలో నిర్వహిస్తున్న డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా నటుడు కిరీటి నడుపుకుంటూ వస్తున్న వాహానాన్ని పోలీసులు ఆపి, తనిఖీ చేశారు. బ్రీత్ ఎనలైజింగ్ పరీక్షల్లో ఆల్కహాల్ లెవల్ 36గా నమోదైంది. దీంతో ఆయన వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు 45లో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా మద్యం మత్తులో ఓ యువతి కారు నడుపుతూ  తెగ హల్ చల్ చేసింది. 

అంతే కాదు తాను మహిళా కానిస్టేబుల్ వెంట వస్తానని చెప్పడంతో అక్కడ కలకలం చేపింది. మరో చోటు విధుల్లో ఉన్న మహిళా పోలీసును రప్పించారు. అనంతరం శ్వాస పరీక్షలు నిర్వహించగా ఆల్క్‌హాల్ మోతాదు 86 పాయింట్లగా నమోదైంది. దీంతో ఆమెపై కేసు నమోదుచేసి, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: