నందమూరి బాలకృష్ణ హీరోగా సినిమా అంటే దాదాపు ఆయన చెప్పిన వారినే హీరోయిన్ గా మిగతా స్టార్ కాస్ట్ అంతా ఉంటుందని ఇండస్ట్రీ టాక్. ఇందులో వాస్తవ అవాస్తవాలు ఏంటో ఎవరికి తెలియవు ఇక తనకు నచ్చిన హీరోయిన్ అయితే బాలయ్య పిలిచి మరి అవకాశాలు ఇచ్చేస్తాడట. లేటెస్ట్ గా అలానే పెళ్లైనా సరే ఆమెను తన సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాల్సిందే అంటున్నాడట.


జై సింహా తర్వాత ఎన్.టి.ఆర్ బయోపిక్ కు శ్రీకారం చుట్టిన బాలకృష్ణ ఆ సినిమా ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉండటంతో ఇప్పుడు తన తర్వాత సినిమా లైన్ లోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నాడట. వినాయక్ డైరక్షన్ లో సి. కళ్యాణ్ నిర్మాణంలో ఆ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.


ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మరోసారి శ్రీయా కావాల్సిందే అని పట్టుబడుతున్నాడట బాలయ్య బాబు. వినాయక్ డైరక్షన్ లో వచ్చిన చెన్నకేశవ రెడ్డి సినిమాలో బాలకృష్ణ సరసన నటించింది శ్రీయ శరణ్. ఆ తర్వాత చాన్నాళ్లకు ఆమెకు గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలో ఛాన్స్ వచ్చింది. 


శాతకర్ణి తర్వాత ఆ వెంటనే పైసా వసూల్ సినిమాకు ఛాన్స్ ఇచ్చాడు బాలయ్య బాబు. అయితే సీనియర్ హీరోలకు తగిన జోడిగా హీరోయిన్స్ కరువవడంతో మళ్లీ సీనియర్ హీరోయిన్స్ దగ్గరకే వెళ్తున్నారు. అప్పటికి జై సింహా కోసం నయనతార చేసినా ఆమె తమిళంలో బిజీ అవడంతో షూటింగ్ లో ఇబ్బందులు ఎదురవుతున్నాయట. అందుకే వినాయక్ సినిమాకు శ్రీయనే కన్ఫాం చేశారట బాలకృష్ణ. ఈమధ్యనే రష్యన్ యువకుడిని పెళ్లాడిన శ్రీయ శరణ్ పెళ్లి తర్వాత కూడా సినిమాలు ఆపేదే లేదని అన్నది. అలానే సినిమాలు చేస్తుంది. మరి పెళ్లైన ఈ ముదురు భామతో బాలయ్య రొమాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.  
 


మరింత సమాచారం తెలుసుకోండి: