ఇండస్ట్రీలో కొన్ని బ్యానర్లో వెనుకపడ్డట్టు అనిపించినా దాని వెనుక కొన్ని కథలు ఉంటాయి. గ్యాప్ వచ్చినా మళ్లీ తమ రేంజ్ కు తగిన సినిమాతోనే వస్తారు. ప్రస్తుతం ఇప్పుడు అలాంటి సినిమాతోనే ఫాంలోకి వచ్చారు బడా నిర్మాత వైజయంతి మూవీస్ అధినేత అశ్వనిదత్. 


సావిత్రి జీవిత కథతో మహానటి సినిమా తన బ్యానర్లో తీసి బ్యానర్ యొక్క ప్రతిష్టను పెంచేలా చేసుకున్నారు. నిజానికి నిర్మాణ బాధ్యతంతా కూతుళ్లు ప్రియాంకా, స్వప్నాలు మీద వేసుకున్నా అశ్వనిదత్ గారు ఓకే చెప్పాకే వారు రంగంలోకి దిగేది. మహానటి సినిమా ఈ రేంజ్ విజయాన్ని అందుకోవడంలో వైజయంతి బ్యానర్ వాల్యూ కూడా ఒకటని చెప్పొచ్చు. 


ఇప్పుడు కాదు అసలు ఎలాంటి ప్రయోగం చేయాలన్నా భయపడే 1990లోనే కళ్లుచెదిరే సెట్టింగులతో జగదేక వీరుడు అతిలోకసుందరి అనే సినిమా తీసి హిట్ అందుకున్నారు అశ్వనిదత్. ఆ సినిమా బడ్జెట్ అప్పటి రెగ్యులర్ సినిమాల కన్నా చాలా ఎక్కువ. అయితే ఇప్పుడు మహానటి సినిమాకు బడ్జెట్ లిమిటేషన్స్ లేకుండా తీశారు. 


ఇక ఇప్పుడు ఈ ప్రొడక్షన్ హౌజ్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో సినిమా చేయాలని చూస్తున్నారట. మహానటిలో తారక్ ను సీనియర్ ఎన్.టి.ఆర్ గా నటింపచేయాలని చూసినా కుదరలేదు అందుకే ఎన్.టి.ఆర్ తో ఓ భారీ బడ్జెట్ సినిమా ప్లాన్ చేస్తున్నారట. దర్శకుడెవరు అన్నది ఈ నెల చివరి కల్లా చెప్పేస్తారట. మొత్తానికి వైజయంతి బ్యానర్ మళ్లీ తన పూర్వ వైభవాన్ని తెచ్చుకుంటుందని చెప్పొచ్చు.  



మరింత సమాచారం తెలుసుకోండి: