రోబో శంకర్ దర్శకత్వం లో రజినీకాంత్ హీరో గా ఇండియా లోనే ఎంతో ప్రతిష్ఠాత్మకమైన మూవీ అని చెప్పవచ్చు. సుమారు రెండేళ్ల నుంచి శంకర్ దీనిని చెక్కుతూనే ఉన్నాడు. అయితే రోబో సినిమా కు వచ్చినన్ని ఇబ్బందులు ఏ సినిమా కు రాలేదని చెప్పవచ్చు. తాజాగా ఈ సినిమా  గ్రాఫిక్ పనులు ఒక కంపెనీ కి ఇచ్చారు.అయితే అది దివాలా తీయడం తో మేజర్ సీన్స్ అన్ని ఇంకా పూర్తి కాలేదు. దీనితో మూవీ టీజర్ ఇంకా రిలీజ్ చేయలేదు.

Image result for robo 2.0

ప్రస్తుతానికి సినిమాకు సంబంధించి ఒక సెగ్మెంట్ గ్రాఫిక్స్ మాత్రమే జరుగుతున్నాయి. అది చాలా చిన్న పోర్షన్. మేజర్ పార్ట్ గ్రాఫిక్ పనులు మాత్రం నిలిచిపోయాయి. ఈసారి ఈ ప్రాజెక్టు ఎవరికి అప్పగించాలనే విషయంపై లైకా ప్రొడక్షన్స్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు సినిమా టీజర్ రిలీజ్ పై కూడా సంస్థ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ సినిమా టీజర్ ఇప్పటికే లీక్ అయిన విషయం తెలిసిందే. దీంతో కొత్తగా మరో టీజర్ కట్ చేయించారు.

Image result for robo 2.0

పాత టీజర్ లోని సన్నివేశాలకు మరికొన్ని కొత్త సీన్లు జతచేసి టీజర్ ను తయారుచేసినట్టు తెలుస్తోంది. ఐపీఎల్ ఫైనల్స్ సందర్భంగా ఈనెల 27న ఆ టీజర్ ను విడుదల చేస్తారట. ప్రస్తుతానికైతే గ్రాఫిక్ పనులు ఎవరికి అప్పగించాలనే అంశంపై లైకా ప్రొడక్షన్స్ నిర్మాతలు సీరియస్ గా ఆలోచిస్తున్నారు. ఈ అంశం ఓ కొలిక్కి వచ్చిన తర్వాత టీజర్, ట్రయిలర్ విడుదల తేదీలను ప్రకటిస్తారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: