నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీయాలనుకున్న ఎన్టీఆర్ బయోపిక్ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి ఇంకా సమయం ఉండటంతో, ఈలోగా వినాయక్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి బాలకృష్ణ సిద్ధమవుతున్నాడు. సి.కల్యాణ్ నిర్మిస్తోన్న ఈ సినిమాను ఈ నెల 25వ తేదీన గానీ .. 27వ తేదీన గాని ఆరంభించనున్నారు. ఇప్పటికే వంద సినిమాలు పూర్తి చేసిన బాలకృష్ణ వెంట వెంటనే సినిమాలు తీస్తున్నారు. పైసా వసూల్, జై సింహ సినిమాల తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ తీయాలనుకున్నారు.
ఈ సినిమాకు సంబంధించిన ముహూర్తం కూడా ఎంతో గ్రాండ్ గా చేశారు. కాకపోతే ఎన్టీఆర్ బయోపిక్ దర్శకులు తేజ ఆ ప్రాజెక్ట్ నుంచి పక్కకు తప్పుకున్నారు. దాంతో ఈ సినిమా డైలమాలో పడింది..కానీ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ త్వరలో క్రిష్ చేతికి వెళ్లబోతుందట. ఈలోగా వివివినాయక్ దర్శకత్వంలో ఓ సినిమా ప్లాన్ చేశారు. బాలకృష్ణ .. వినాయక్ మార్క్ కి తగినట్టుగానే ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటుందని అంటున్నారు.
ఇక బాలకృష్ణ సినిమాలంటే..పవర్ ఫుల్ డైలాగ్స్ ఉంటాయని తెలిసిందే..అందుకోసం సినిమాకి పరుచూరి బ్రదర్స్ సంభాషణలు సమకూర్చుతున్నట్టు తెలుస్తోంది. గతంలో బాలకృష్ణ చేసిన చాలా సినిమాలకి పరుచూరి బ్రదర్స్ పనిచేశారు.
ఈ సారి కూడా బాలకృష్ణ సినిమాకి పరుచూరి రాసే డైలాగ్స్ చాలా పవర్ఫుల్ గా ఉంటాయనీ .. బాలకృష్ణ అభిమానుల చేత విజిల్స్ వేయిస్తాయని అంటున్నారు. ప్రస్తుతం క్రిష్ వేరే ప్రాజెక్ట్ లో ఉండటంతో..ఎన్టీఆర్ బయోపిక్ మరికాస్త ఆలస్యం కావొచ్చని..అందుకే వివివినాయక్ దర్శకత్వంలో మరో మాస్ ఎంట్రటైన్ మెంట్ తో బాలకృష్ణ సిద్దం అవుతున్నట్లు సమాచారం.