కింగ్ నాగార్జున, నాచురల్ స్టార్ నాని కలిసి చేస్తున్న సినిమా ఓ బాలీవుడ్ సినిమా రీమేక్ గా రాబోతుందని వార్తలు జోరందుకున్నాయి. నాగ్, నాని ఇలాంటి క్రేజీ కాంబినేషన్ లో సినిమా అంటే కచ్చితంగా అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో తెలిసిందే. అయితే ఈ సినిమాపై విచిత్రంగా రీమేక్ రూమర్స్ ఎక్కువయ్యాయి.


ఈ సినిమాను బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా జాని గద్దార్ సినిమాకు రీమేక్ గా చెప్పుకుంటున్నారు. 2007లో వచ్చిన జానీ గద్దార్ సినిమాను శ్రీరాం రాఘవన్ డైరెక్ట్ చేశారు. ఆ సినిమాలో ధర్మేంద్రా, నీల్ నితిన్ ముఖేష్ నటించడం జరిగింది. ఇక ఇప్పుడు నాగార్జున, నానిలు కూడా అదే తరహాలో వారి పాత్రల్లో నటిస్తున్నారని అంటున్నారు.


ఇక ఈ సినిమా రీమేక్ ఇంకా కాపీ వివాదంపై స్పందించాడు చిత్ర దర్శకుడు శ్రీరాం ఆదిత్య. తన సినిమా ఏ మూవీకి రీమేక్ కాదని తన సొంతంగా స్క్రిప్ట్ రాసుకున్నాని సోషల్ మీడియా ద్వారా రెస్పాండ్ అయ్యాడు. నాగార్జున డాన్ గా, నాని డాక్టర్ గా కనిపిస్తున్న ఈ సినిమాను వైజయంతి బ్యానర్లో అశ్వనిదత్ నిర్మిస్తున్నారు.


భలే మంచి రోజు సినిమాతో దర్శకుడిగా పరిచయమైన శ్రీరాం ఆదిత్య రెండవ ప్రయత్నంగా శన్మంతకమణి సినిమా చేశాడు. మూడవ ప్రయత్నంగా మల్టీస్టారర్ సెట్ చేశాడన్నమాట. తన సినిమాపై ఎప్పుడూ మంచి కాన్ ఫిడెంట్ గా ఉండే శ్రీరాం ఆదిత్య ఈ సినిమాతో కూడా పక్కా హిట్ కొట్టడం గ్యారెంటీ అంటున్నాడు. మరి ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: