టాలీవుడ్‌లోని యువ కథానాయికలలో అదృష్టవంతుడయిన హీరో ఎవరంటే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనే చెప్పాలి. ఎందుకంటే చేసింది మూడు సినిమాలే అయినా చేస్తున్న ప్రతీ సినిమాలో ఒక స్టార్ హీరోయినే నటించడం, తారాగణం కూడా మంచి పేరున్న వారే నటించటం అంతకుమించి ఎంత కావాలంటే అంత ఖర్చుపెడుతున్న నిర్మాతలు, పెద్ద డైరెక్టర్లతో హిట్, ఫ్లాప్ అని సంబంధం లేకుండా ఛాన్సులు కొట్టేస్తున్నాడు.


తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ తన నాలుగో సినిమా సాక్ష్యంలో మరొక స్టార్ హీరోయిన్ పూజా హెగ్దేతో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కు సంబంధించిన బడ్జెట్ అంశం బయటకుపొక్కింది. పది కాదు, ఇరవై కాదు ఏకంగా నలభై కోట్లు ఈ సినిమాకు ఖర్చు చేసినట్లు వార్తలు వచ్చాయి. పెద్దగా మార్కెట్ లేని అందులోనూ ఒక యువ హీరో సినిమాకు ఇంత పెద్ద మొత్తంలో ఖర్చుచేయడం నిర్మాత అభిషేక్ రిస్క్ తీసుకోవడం సర్వత్రా ఆసక్తిని రేపుతోంది.


కాగా ఇప్పటికే ఈ సినిమాకు సంబందించి శాటిలైట్, డిజిటల్ హక్కులకు పదిహేను కోట్ల వరకు వచినట్లు టాక్. అయితే మిగితా డబ్బులు మటుకు థియేట్రికల్ హక్కుల ద్వారానే రావాల్సిన పరిస్థితి. అంటే దాదాపు ఇరవై ఐదు కోట్లు రావాలి. పెద్దగా మార్కెట్ లేని హీరోపై ఇరవై కోట్ల థియేట్రికల్ డబ్బులు ఆశించడం అసాధ్యమే అయినా కేవలం కథతో నమ్మకముంచి మేము ముందుకెళుతున్నామని చిత్ర బృందం పట్టుదలతో ఉంది. కాగా జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: