కరీనాకు దుబాబ్ కంట్రి నుండి పిలుపొచ్చింది. అక్కడి షేక్‌ల ముందు వ‌చ్చి డ్యాన్స్ చేయాలంట‌. దీనికి ఖ‌రాఖండిగా నో అని చెప్పేసింది. అమితాబ్‌బ‌చ్ఛన్‌,అజ‌య్‌దేవ‌గ‌న్‌,క‌రీనాక‌పూర్ న‌టించిన స‌త్యాగ్రహ మూవీ ప్రమోష‌న్ కోసం క‌రీనా,అజ‌య్‌దేవ‌గ‌న్ ఇంకా స‌త్యాగ్రహ యూనిట్ దుబాయ్ వెళ్ళింది. బాలీవుడ్ మూవీల‌కు దుబాయ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువుగానే ఉంటుంది. ఆగ‌ష్టు 15న రిలీజ్ కావ‌ల్సిన ఈ మూవీ పోస్టపోన్ చేసుకొని ఆగ‌ష్టు 30న రిలీజ్ అవుతుంది. ప్రమోష‌న్‌లో భాగంగా దుబాయ్ వెళ్లిన క‌రీనా అక్కడి అభిమానుల మ‌ధ్యన‌ మూబ్ డ్యాన్స్‌ను చేసింది.

అభిమానుల మ‌ధ్యలో ష‌డ‌న్‌గా క‌నిపించి క‌రీనాక‌పూర్,అజ‌య్‌దేవ‌గ‌న్ ఇద్దరూ మూబ్ డ్యాన్స్ చేశారు. దీంతో ఒక్కసారిగా క్రౌడ్ పెరిగి, అక్కడి వాతావ‌ర‌ణం కొంచెం అల్లరిగా మారింది. వెంట‌నే పోలీసులు రంగంలోకి దిగి ఆ గుంపును చెద‌ర‌గొట్టారు. కొంత స‌మ‌యం త‌రువాత క‌రీనా,అజ‌య్‌దేవ‌గ‌న్‌లు మ‌ళ్ళీ డ్యాన్స్ చేశారు. ఆ విధంగా మూబ్ డ్యాన్స్‌ని ఫినిష్ చేసుకొని ఇండియాకు వ‌స్తుండ‌గా క‌రీనాకు మెసేజ్ వ‌చ్చింది. దుబాయ్ షేక్ ముందు డ్యాన్స్ చేయాల‌ని. ఈ త‌ర‌హా డిమాండ్స్ బాలీవుడ్ హీరోయిన్స్‌కు త‌రుచూ వ‌స్తూనే ఉంటాయి. కానీ క‌రీనా అంగీక‌రించ‌క‌పోవ‌డంతో ఆ ప్రొగ్రామ్ క్యాన్సిల్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: