మల్టీస్టారర్ సినిమాలు ఊపందుకున్న ఈ టైంలో ఓ పక్క రాజమౌళి ఎన్.టి.ఆర్, రాం చరణ్ లతో క్రేజా మల్టీస్టారర్ షురూ చేయగా మరోపక్క వెంకటేష్, వరుణ్ తేజ్ తో అనీల్ రావిపుడి ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అని సినిమా మొదలుపెట్టాడు. ఇక ఈ సినిమా కాకుండానే విక్టరీ వెంకటేష్ మరో మల్టీస్టారర్ చేస్తున్నాడు. తన మేనళ్లుడు నాగ చైతన్యతో వెంకీ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు.


మేనమామ, మేనళ్లుడు అదే పాత్రల్లో సినిమాలో కూడా నటిస్తున్నారట. జనార్థన మహర్షి కథ అందించగా ఈ సినిమాకు బాబి డైరక్షన్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ గా నయనతార, రకుల్ ప్రీత్ సింగ్ సెలెక్ట్ అయ్యారని తెలుస్తుంది. విక్టరీ వెంకటేష్ కు జోడీగా నయనతార, చైతు కోసం రకుల్ ను ఎంచుకున్నారట. వెంకీతో నయన్ జోడి అంటే సూపర్ అన్నట్టే. ఆల్రెడీ లక్ష్మి, తులసి, బాబు బంగారం సినిమాలఓ ఈ జోడి కలిసి నటించారు.


ఇక ఈసారి వెంకటేష్, నయనతార మరింత ఇంప్రెస్ చేయనున్నారట. నాగ చైతన్యకు జోడీగా హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ను సెలెక్ట్ చేశారట. రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో ఈ ఇద్దరు జోడి కట్టడం జరిగింది. ఆ సినిమా తర్వాత ఇందులో మళ్లీ కలిసి నటిస్తున్నారు చైతు, రకుల్. తెలుగులో టాప్ హీరోయిన్ రేంజ్ కు వెళ్లిన అమ్మడు ప్రస్తుతం చేతిలో సినిమాలేవి లేవని చెప్పాలి.


బాలీవుడ్ ఆఫర్ వచ్చాక అక్కడ అదృష్టాన్ని పరిక్షించుకున్న అమ్మడు తెలుగులో అవకాశాలు సన్నగిల్లాయని తమిళ పరిశ్రమ మీద దృష్టి పెట్టింది. వెంకటేష్, నాగ చైతన్యలకు జోడీగా నయనతార, రకుల్ ఎలా ఇంప్రెస్ చేస్తారో చూడాలి. బాబి డైరక్షన్ లో రాబోతున్న ఈ సినిమా క్రేజీ మల్టీస్టారర్ సినిమాల్లో ఒకటని చెప్పొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: