తమిళ హీరో విశాల్ కి తెలుగు లో కూడా మంచి క్రేజ్ ఉంది. వాస్తవానికి తెగులు వాడైన విశాల్ తమిళ ఇండస్ట్రీలో బాగా సెటిల్ అయ్యాడు. తెలుగు లో నటించిన పందెం కోడితో మంచి పాపులారిటీ తెచ్చుకున్న విశాల్ ఆ తర్వాత తెలుగు లో ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యాయి. తాజాగా విశాల్, సమంత జంటగా నటించిన తమిళ సినిమా ఇరుంబు తిరై..ఈ మూవీలో యాక్షన్ కింగ్ అర్జున్ మరొక ముఖ్యపాత్రధారి. పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఇటీవలే తమిళంలో విడుదలై విజయం సాధించింది.
ఈ సినిమాని అభిమన్యుడు పేరుతో జి.హరి తెలుగులో విడుదల చేస్తున్నారు. తెలుగు వెర్షన్ సెన్సార్ పూర్తిచేసుకుంది. జూన్ 1 న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన తెలుగు వర్షన్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఇటీవల పెరిగిపోతున్న సైబర్ క్రైమ్స్ నేపథ్యంతో ఈ మూవీని రూపొందించారు.. మన డేటా ఇతరుల చేతిలో చిక్కితే ఏమవుతుందో ఈ మూవీలో ప్రధానంగా ఎత్తి చూపారు.
ఈ సినిమాలో ఒకప్పటి యాక్షన్ హీరో అర్జున్ విలన్ గా నటిస్తున్నారు. సినిమాలో డైలాగుల్లో కూడా పంచ్ లు బాగానే ఉన్నాయి. మీరంతా దొంగలు..నేను తెలు..నేను కూడితే మూసుకొని ఉండాలి అంటూ అర్జున్ కొట్టే డైలాగ్ తో ట్రైలర్ ముగిసింది. మొత్తానికి ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమాపై మంచి అంచనాలే పెరిగిపోతున్నాయి. ఈ సినిమాకి సంగీతం యువన్ శంకర్రాజా, ఛాయాగ్రహణం జార్జి సి.విలియమ్స్, మాటలు రాజేష్.