చందమా కథలు తీసిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు యాంకర్ రష్మితో గుంటూర్ టాకీస్ అని తీసి క్రేజీ హిట్ అందుకున్నాడు. మొదటి సినిమాకు, రెండో సినిమాకు చాలా చేంజ్ చూపించిన ప్రవీణ్ తనలోని అసలు సిసలు దర్శకుడిని పిఎస్వి గరుడవేగ ద్వారా పరిచయం చేశాడు. యాంగ్రీ యంగ్ మెన్ డాక్టర్ రాజశేఖర్ మళ్లీ తిరిగి క్రేజ్ తెచ్చేలా చేసిన సినిమా గరుడవేగ. ఈ సినిమా సక్సెస్ వల్ల రాజశేఖర్ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కారు. 


గరుడవేగ సక్సెస్ తో దర్శకుడు ప్రవీణ్ సత్తారుకి మంచి అవకాశాలే వచ్చాయి. ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా స్రవంతి మూవీస్ బ్యానర్ లో ఓ సినిమా ముహుర్తం పెట్టారు. కాని దర్శకుడు అడిగిన బడ్జెట్ ఇవ్వడం కుదరదని చెప్పేసరికి ప్రవీణ్ ఆ ప్రాజెక్ట్ నుండి బయటకు వచ్చాడు. ఇక ఇప్పుడు అదే కథను రాజశేఖర్ తో చేయాలని చూస్తున్నాడట ప్రవీణ్ సత్తారు. రాజశేఖర్ కూడా అందుకు సై అన్నాడని తెలుస్తుంది.


ప్రస్తుతం ఈ సినిమా నిర్మాత వేటలో ఉన్నాడట ప్రవీణ్. ఈ కథలో హీరో కూడా ఆర్మీ ఆఫీసర్ గా కనిపిస్తాడట. ప్రవీణ్ కసి చూస్తుంటే తాను అనుకున్న బడ్జెట్ లో సినిమా తీసి తన సత్తా ఏంటో చాటాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. రామ్ కు కథ నచ్చినా స్రవంతి రవికిశోర్ మాత్రం తను చెప్పిన బడ్జెట్ లోనే ఈ సినిమా పూర్తి చేయాలని కండీషన్ పెట్టాడట. అందుకే రామ్ సినిమా ఆపేశారు. 


ప్రవీణ్ అనుకున్న బడ్జెట్ దొరికితే ఈ సినిమా మళ్లీ మరో గరుడవేగా రేంజ్ లో ఈసారి కచ్చితంగా కమర్షియల్ సక్సెస్ కూడా అందుకునేలా చేస్తాడని అంటున్నారు. ప్రవీణ్ ప్రస్తుతం బడా నిర్మాణ సంస్థలకు ఈ కథ వినిపించే పనిలో ఉన్నారని తెలుస్తుంది. ఒకవేళ రాజశేఖర్ తో ఈ సినిమా చేస్తే గరుడవేగ-2 అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అంటున్నారు ఆడియెన్స్.



మరింత సమాచారం తెలుసుకోండి: