టాలీవుడ్‌ స్టార్‌ హీరో జూనియర్ ఎన్టీఆర్‌ మరియు ఆయన సతీమణి ప్రణతి కి  సంబంధించి ఓ వార్త గతరాత్రి నుంచి డిజిటల్ మీడియాలో, సోషల్‌ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. లక్ష్మీ ప్రణతి  ఆడబిడ్డకు  జన్మినిచ్చిందంటూ రూమర్స్ వచ్చాయి. చివరకు అది వట్టి రూమర్ వార్తనే అని తేలిపోయింది. 


దీనికి సంబందించి ఎన్టీఆర్ పిఆర్  క్లారిటీ ఇచ్చాడు. ఇటీవల ఎన్టీఆర్ తల్లిగారు భీమవరంలోని మావూళ్ళమ్మ గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు జరిపించారట. ఇంటిలోకి కొత్త వ్యక్తి రాబోతున్న సందర్భాన్ని పురస్కరించుకుని తల్లి బిడ్డా క్షేమంగా ఉండాలని కోరుతూ ఈమేరకు మ్రొక్కుకున్నారట.


కాగా ఎటువంటి నిర్ధారణ లేకుండానే  ఫ్యాన్స్, మీడియా అత్యుత్సాహంతో ఇటువంటి వార్తలను ప్రసారం చేయడం పట్ల జానియర్ ఎన్టీఆర్ తో పాటు నందమూరి కుటుంబ సభ్యులు సైతం అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. నిజానిజాలు తెలుసుకోకుండా ఇంటువంటి వార్తలు రాయొద్దని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: