మాస్ హీరోగా కెరియర్ లో కమర్షియల్ హిట్లు అందుకున్న గోపిచంద్ కొన్నాళ్లుగా కామెడీ ఎంటర్టైనర్ సినిమాలను చేస్తూ వచ్చాడు. ఇక ప్రస్తుతం చక్రవర్తి డైరక్షన్ లో పంతం సినిమా చేస్తున్నాడు గోపిచంద్. సత్య సాయి ఆర్ట్స్ లో కె.కె రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మెహెరీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తుంది.


ఈ సినిమా టీజర్ కొద్ది గంటల క్రితం రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈసారి ఎలాగైనా పంతం నెగ్గించాలన్న తపన గోపిచంద్ లో కనబడుతుంది. టీజర్ లోనే తన లుక్ అదరగొట్టాడు. ఇక ఈ సినిమా కరప్షన్, పొలిటికల్ సెటైర్ గా వస్తుందని చెప్పొచ్చు. సినిమా మాస్ మూవీగా అనిపిస్తున్నా శ్రీనివాస్ రెడ్డి కామెడీ అలరిస్తుందని తెలుస్తుంది.


గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా గోపిచంద్ కు కచ్చితంగా హిట్ ఇవ్వాల్సిందే. టీజర్ కట్ చేసిన విధానం చూస్తే తప్పకుండా మంచి కంటెంట్ తోనే వస్తున్నారని చెప్పొచ్చు. టీజర్ అయితే ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. ఇక సినిమా ఎలా ఉంటుందో చూడాలి.


యువ హీరోలంతా వరుస సక్సెస్ లతో దూసుకెళ్తుంటే హిట్ కోసం యజ్ఞం చేస్తున్నాడు గోపిచంద్. ఈమధ్య వచ్చిన ఆక్సీజన్, గౌతం నంద కూడా నిరాశ పరచడంతో ఈసారి హిట్ టార్గెట్ తో వస్తున్నాడు గోపిచంద్. ఆడియెన్స్ తనని ఎలా చూడాలనుకుంటున్నారో ఇన్నాళ్లకు గుర్తించిన గోపిచంద్.. ఈ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కేస్తాడేమో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: