నాని హోస్ట్ గా రాబోతున్న బిగ్ బాస్ సెకండ్ సీజన్ మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. 100 రోజుల పాటు బుల్లితెర ఆడియెన్స్ ను అలరించేందుకు వస్తున్న ఈ రియాలిటీ షోకి అందరు సిద్ధం అవుతున్నారు. నాని హోస్ట్ గా ఒకే కాని కంటెస్టంట్స్ ఎవరన్నది ఫైనల్ లిస్ట్ లీక్ అవ్వలేదు.


శ్రీరెడ్డితో పాటుగా ఎంతోమంది పేర్లు వినపడుతున్నా అవేవి నిజమని చెప్పలేం. ఇక లేటెస్ట్ గా బిగ్ బాస్-2లో ఓ క్రేజీ న్యూస్ రీడర్ కూడా ఉండబోతుందని తెలుస్తుంది. ప్రముఖ న్యూస్ ఛానెల్ టివి-9 న్యూస్ రీడర్, యాంకర్ దీప్తి నల్లముత్తు ఈసారి బిగ్ బాస్ హౌజ్ లో ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది.


యాంకర్ గా తన మార్క్ చూపిస్తూ ఆడియెన్స్ మెప్పు పొందుతున్న దీప్తి బిగ్ బాస్ లో ఛాన్స్ అందుకోవడం గొప్ప విషయమని చెప్పాలి. బిగ్ బాస్ వల్లే ఇంతకుముందు అతనెవరో తెలియని కత్తి మహేష్ రివ్యూయర్ గానే కాదు సంచలనాలకు కేంద్ర బిందువుగా మారాడు. ఇక ఇప్పుడు ఈ సీజన్ లో కూడా స్ట్రాంగ్ ఐడెంటిటీ కోసం చాలామంది ప్రయత్నిస్తున్నారు. 


దీప్తితో పాటుగా తేజశ్వి మడివాడా, సింగర్ గీతా మాధురి బిగ్ బాస్-2లో కంటెస్టంట్స్ గా కనిపిస్తారని తెలుస్తుంది. ఫైనల్ లిస్ట్ ఏంటన్నది తెలియాలంటే ఈ ఆదివారం వరకు వెయిట్ చేయాల్సిందే. ఈసారి గేం ప్లాన్స్, ప్రోగ్రాం కాన్సెప్ట్ కూడా కొత్తగా ఉండబోతున్నాయని తెలుస్తుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: