టాలీవుడ్ హీరోలు ఎంతమంది ఉన్నా నవ మన్మధుడు అంటే మాత్రం నాగార్జుననే అని చెప్తారు. ఇద్దరు కొడుకులు హీరోలుగా రాణిస్తున్నా ఆయన ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదు. అక్కినేని వారసత్వానికి న్యాయం చేస్తూ వచ్చిన నాగార్జున తనయులిద్దరిని మంచి హీరోగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.


పెద్దోడు నాగ చైతన్య జోష్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మొదటి సూపర్ హిట్ ఇచ్చింది మాత్రం ఏమాయ చేసావే సినిమానే. గౌతం మీనన్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాతో చైతు, సమంతల పరిచయం ఏర్పడింది. మంచి రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా వచ్చి సూపర్ సక్సెస్ కొట్టిన ఈ సినిమాతో తెలుగులో కొత్త ట్రెండ్ సృష్టించారు.


రెహమాన్ మ్యూజిక్ మాయ.. గౌతం మీనన్ డైరక్షన్ తెలుగు ప్రేక్షకులను ప్రేమ పరవశంలో మునిగితేలేలా చేశాయి. ఈ సినిమాతో పరిచయమైన చైతు,  సమంతలే ప్రేమ పెళ్లి చేసుకున్నారు. గౌతం మీనన్ ఇప్పుడు ఏమాయ చేసావే సినిమాకు సీక్వల్ మూవీ ప్లాన్ చేస్తున్నాడట. తమిళంలో శింభు ఓకే చెప్పగా చైతు కూడా అందుకు సరే అన్నాడట. 


హీరోలిద్దరు ఓకే కాని హీరోయిన్స్ ఎవరిని పెట్టాలా అన్న సందిగ్ధంలో ఉన్నాడట గౌతం మీనన్. ఒకవేళ నిజంగానే ఏమాయ చేసావే సీక్వల్ వస్తే మళ్లీ చైతు కెరియర్ కు మంచి బూస్టప్ ఇచ్చినట్టే అవుతుంది. ప్రస్తుతం చైతు సవ్యసాచి, శైలజా రెడ్డి అల్లుడు సినిమాలతో బిజీగా ఉన్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: