టాలీవుడ్ లో మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా చేసుకొని నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘మహానటి’సినిమా తెరకెక్కించారు.  సావిత్రి పాత్రలో మళియాళ నటి కీర్తి సురేష్ నటించారు. మొదట అంత గొప్ప నటి పాత్ర తాను మెప్పించగలనా అన్న సందేహాలు కీర్తి సురేష్ అనుకుందట..అయితే సావిత్రి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఆ పాత్రను ఛాలెంజ్ గా తీసుకొని నటించినట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.  ‘మహానటి’లో కొన్ని సీన్లు అచ్చం సావిత్రిని పోలినట్లు కనిపించడం మరో విశేషం. 
Image result for mahanati movie
నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాలలోను .. ఓవర్సీస్ లోను నీరాజనాలు పడుతున్నారు. 'మహానటి' చూసిన సినీ ప్రముఖులంతా ఈ సినిమా టీమ్ కి అభినందనలు తెలిపారు.  ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అని మరుసటి రోజు నుంచి చిత్ర యూనిటపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.  టాలీవుడ్, కోలీవుడ్ మాత్రమే కాదు..రాజకీయ నాయకులు సైతం ఈ సినిమా అద్భుతంగా ఆవిష్కరించారని ప్రశంసించారు. 
Image result for mahanati movie
అంతే కాదు చిరంజీవి దర్శక నిర్మాతలను తన ఇంటికి ఆహ్వానించి సత్కరించిన సంగతి తెలిసిందే.బిజీగా ఉండటం వలన కాస్త ఆలస్యంగా చరణ్ ఈ సినిమా చూశాడు. 'మహానటి' చూసిన వెంటనే ఆయన తనదైన శైలిలో ఫేస్ బుక్ ద్వారా స్పందించాడు. 'మహానటి' సినిమా నా మనసును ఎమోషనల్ గా టచ్ చేసింది. సావిత్రిగా కీర్తి సురేశ్ అద్భుతంగా నటించింది.

ఈ పాత్రను ఆమె తప్ప వేరెవరూ ఇంతబాగా చేయలేరనిపించింది. సమంత .. దుల్కర్ సల్మాన్ .. విజయ్ దేవరకొండల నటన కూడా ఎంతో సహజంగా వుంది. ఇంతగొప్ప చిత్రాన్ని అందించిన నిర్మాతలకి శుభాకాంక్షలు" అని రాసుకొచ్చాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: