సినిమా ఇండస్ట్రీలో కొంత కాలాంగా స్టార్ హీరోల వారసులు హీరోలు గా ఎంట్రీ ఇస్తున్నారు.  అయితే కూతుళ్లు మాత్రం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం లేదు..అయితే విలక్షణ నటులు మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి నటిగా ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటుతుంది. ఓ వైపు బుల్లితెరపై యాంకర్ గా కొనసాగుతూ..సినిమాల్లో హీరోయిన్ గా..క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు.  నటిగా, నిర్మాతగా వైవిధ్యభరిత సినిమాలతో ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న మంచు లక్ష్మి ప్రసన్న మరో సినిమాతో వచ్చారు.

ఈ సారి ట్రైలర్‌తో ఆసక్తిని రేపుతున్నారామె. లక్ష్మి ప్రసన్న ప్రధాన పాత్రలో రూపొందిన ‘వైఫ్ ఆఫ్ రామ్’ సినిమా ట్రైలర్ విడుదల అయ్యింది. ఈ సినిమాలో ఆమె భర్త పాత్ర హత్య చేయబడుతుంది. ఆ మర్డర్ మిస్టరీని ఛేదించడానికి ఒక వైపున పోలీసులు ప్రయత్నిస్తుంటే .. మరో వైపున ఆమె కూడా తన ప్రయత్నం తాను చేస్తుంటుంది. అదే విషయాన్ని ఈ ట్రైలర్ లో ఆసక్తికరంగా చూపించారు. 

ఈ ట్రైలర్ లో కొన్ని సీన్లు  ఆకట్టుకునేలా వుంది .. సినిమాపై ఆసక్తిని పెంచేదిలా వుంది. మంచు ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమాలో, ప్రియదర్శి .. ఆదర్శ్ బాలకృష్ణ ముఖ్యమైన పాత్రలను పోషించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ ట్రైలర్ మరో సినిమాను గుర్తు చేస్తూ ఉంది. అదే ‘కహానీ’.

బాలీవుడ్ లో  విద్యాబాలన్ ప్రధాన పాత్రలో హిందీలో రూపొంది సూపర్ హిట్ అయి, దక్షిణాదిన కూడా నయనతార ప్రధాన పాత్రలో రూపొందింది ‘కహానీ’. భర్త కనబడకుండా పోవడంపై ఒక మహిళ సాగించే పరిశోధనగా ఆ సినిమాను రూపొందించారు. ఈ సినిమా అసలు కథ ఏమిటో తెలియదు కాబట్టి.. ఇప్పుడే ఏం కామెంట్ చేయడానికి లేదు. ట్రైలర్ అయితే.. ఆసక్తిని రేపుతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: