స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య తర్వాత మరే సినిమాకు ఓకే చెప్పలేదు. విక్రం కుమార్ డైరక్షన్ లో సినిమా ఉంటుందని తెలుస్తుంది కాని దానికి సంబందించిన న్యూస్ మాత్రం బయటకు రాలేదు. టాలెంట్ ఉన్న దర్శకులకు అవకాశం ఇచ్చే బన్ని ఓ దర్శకుడికి తనతో సినిమా చేస్తానని హామీ ఇచ్చాడట.


గ్రహణం అంటూ షార్ట్ ఫిల్మ్ తీసి పరిశ్రమను ఎట్రాక్ చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ.. అష్టా చమ్మ నుండి రాబోతున్న సమ్మోహనం వరకు తన మార్క్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. సుధీర్ బాబు హీరోగా వస్తున్న ఈ సమ్మోహనం వచ్చే శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది.


శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బన్నిని కలిసి కథ చెప్పానని ఆయన ఓకే చెప్పాడని అన్నారు. జెంటిల్మన్ టైం లోనే బన్నికి ఓ లైన్ వినిపించాడట ఇంద్రగంటి మోహనకృష్ణ. మనం తప్పకుండా చేద్దాం మోహన్ అని అన్నాడట బన్ని.


ఇప్పటికే వక్కంతం తో సినిమా అనవసరంగా చేశాడని ఫ్యాన్స్ ఫీల్ అవుతుంటే ఇప్పుడు బన్ని ఇంద్రగంటి సినిమా అంటే ఫ్యాన్స్ డౌట్ పడుతున్నారు. అయితే స్టార్ సినిమా అంటే అన్నిటిని దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుందని అంటున్నాడు ఇంద్రగంటి మోహనకృష్ణ. అంతేకాదు మెసేజ్ సినిమా అయితే స్టార్స్ తో తీస్తే ఎక్కువ జనాల్లోకి వెళ్తుందని అన్నారు. బన్ని అతనికి ఎప్పుడు చాన్స్ ఇస్తాడో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: