ఈ ఇయర్ టాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ రంగస్థలం. మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా సుకుమార్ డైరక్షన్ లో వచ్చిన సినిమా ఇది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది. అంచనాలకు మించి వసూళ్లను రాబట్టిన ఈ సినిమా ఇప్పుడు మరో క్రేజీ అటెంప్ట్ చేస్తుంది.


ఇండియన్ సినిమాను శాసిస్తున్న తెలుగు సినిమా మార్కెట్ తన పరిధి బాగా పెంచుకుంది. ఇప్పటికే ఓవర్సీస్ లో బాలీవుడ్ సినిమాలను దాటుకుని తెలుగు సినిమా వసూళ్లు హంగామా సృష్టిస్తున్నాయి. అయితే ఇప్పుడు సినిమాల మార్కెట్ ఇతర దేశాల మీద పడ్డది. ముఖ్యంగా చైనాపై ఇండియన్ సినిమా సత్తా చాటాలని చూస్తున్నారు. 


బాహుబలి సినిమా అక్కడ రిలీజ్ అయ్యి సక్సెస్ అయ్యింది. దంగల్ సినిమా కూడా అక్కడ భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు రంగస్థలం కూడా చైనాలో రిలీజ్ చేస్తున్నారట. సెంటిమెంట్, ఎమోషనల్ మూవీ కాబట్టి ఇది కచ్చితంగా అక్కడి ఆడియెన్స్ కు నచ్చేస్తుందని మేకర్స్ అంటున్నారు.


త్వరలో ఈ సినిమా డబ్బింగ్ వర్షన్ చైనాలో రిలీజ్ చేస్తారట. 125 కోట్ల కలక్షన్స్ తో నాన్ బాహుబలి రికార్డులను తన ఖాతాలో వేసుకున్న రాం చరణ్ చైనాలో కూడా హిట్ కొట్టు కొడితే ఇక ఆ లెక్క వేరేలా ఉంటుందని మాత్రం చెప్పొచ్చు. ప్రస్తుతం బోయపాటి శ్రీను సినిమా చేస్తున్న చరణ్ ఆ తర్వాత రాజమౌళి డైరక్షన్ లో మల్టీస్టారర్ చేస్తున్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: