మహేష్ సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వం లో స్టార్ట్ అవ్వాల్సింది. అయితే ఇంత వరకు ఈ సినిమా గురించి సడి సప్పుడు లేదు. ఇప్పటి వరకు అయితే సినిమా డెహ్రా డూన్ లో జరగాల్సింది. అయితే ఇంత వరకు స్టార్ట్ కాలేదు. దీనితో ఈ సినిమా మీద చాలా రూమర్స్ పుట్టుకొస్తున్నాయి. ఈ సినిమా ప్రొడ్యూసర్స్ ఇంత వరకు నోరు మెదపలేదు. దీనితో అందరికి సందేహాలు మొదలయ్యాయి.

Image result for mahesh babu

ఇంత జ‌రుగుతున్నా నిర్మాత‌లు దిల్ రాజు కానీ, అశ్వినీద‌త్ కాని సినిమా గురించి మాట్లాడ‌టం లేదు. అస‌లు ఈ సినిమా నిర్మాణంలో అశ్విన్ ద‌త్ ఉన్నారా? త‌ప్పుకున్నారా? అని కొత్త సందేహాలు మొద‌ల‌య్యాయి. `మ‌హాన‌టి`కి సినిమాకు సంబంధించి వ‌రుస‌గా మీడియా స‌మావేశాలు నిర్వ‌హించారు. కానీ ఏ సంద‌ర్భంలోనూ అశ్వినీద‌త్ గానీ, కుమార్తెలు ప్రియ‌, స్వ‌ప్న‌లు గానీ మాట్లాంది లేదు. సూప‌ర్ స్టార్ తో సినిమా అంటే స‌గ‌ర్వంగా చెప్పుకుంటారు.

Image result for mahesh babu

కానీ వై జ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్ మాత్రం చ‌డి చ‌ప్పుడు లేకుండా ఉంది. ఈ నేప‌థ్యంలో సినిమా నిర్మాణం నుంచి అశ్విన్ ద‌త్ త‌ప్పుకున్నాడ‌ని ప్ర‌చారం సాగుతోంది. మరో నిర్మాత దిల్ రాజు కూడా మౌనంగా ఉన్నాడు. స్టార్ హీరోలతో సినిమాలు నిర్మిస్తున్నాన‌ని ఎప్పుడూ గ‌ర్వంగా చెప్పుకునే రాజు కూడా ఈసారి మౌనం వ‌హించ‌డంతో సినిమా విష‌యంలో ఏ జ‌రుగుతుందో అర్ధం కాని ప‌రిస్థితులు త‌లెత్తుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: