మహేష్ సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వం లో స్టార్ట్ అవ్వాల్సింది. అయితే ఇంత వరకు ఈ సినిమా గురించి సడి సప్పుడు లేదు. ఇప్పటి వరకు అయితే సినిమా డెహ్రా డూన్ లో జరగాల్సింది. అయితే ఇంత వరకు స్టార్ట్ కాలేదు. దీనితో ఈ సినిమా మీద చాలా రూమర్స్ పుట్టుకొస్తున్నాయి. ఈ సినిమా ప్రొడ్యూసర్స్ ఇంత వరకు నోరు మెదపలేదు. దీనితో అందరికి సందేహాలు మొదలయ్యాయి.
ఇంత జరుగుతున్నా నిర్మాతలు దిల్ రాజు కానీ, అశ్వినీదత్ కాని సినిమా గురించి మాట్లాడటం లేదు. అసలు ఈ సినిమా నిర్మాణంలో అశ్విన్ దత్ ఉన్నారా? తప్పుకున్నారా? అని కొత్త సందేహాలు మొదలయ్యాయి. `మహానటి`కి సినిమాకు సంబంధించి వరుసగా మీడియా సమావేశాలు నిర్వహించారు. కానీ ఏ సందర్భంలోనూ అశ్వినీదత్ గానీ, కుమార్తెలు ప్రియ, స్వప్నలు గానీ మాట్లాంది లేదు. సూపర్ స్టార్ తో సినిమా అంటే సగర్వంగా చెప్పుకుంటారు.
కానీ వై జయంతీ మూవీస్ బ్యానర్ మాత్రం చడి చప్పుడు లేకుండా ఉంది. ఈ నేపథ్యంలో సినిమా నిర్మాణం నుంచి అశ్విన్ దత్ తప్పుకున్నాడని ప్రచారం సాగుతోంది. మరో నిర్మాత దిల్ రాజు కూడా మౌనంగా ఉన్నాడు. స్టార్ హీరోలతో సినిమాలు నిర్మిస్తున్నానని ఎప్పుడూ గర్వంగా చెప్పుకునే రాజు కూడా ఈసారి మౌనం వహించడంతో సినిమా విషయంలో ఏ జరుగుతుందో అర్ధం కాని పరిస్థితులు తలెత్తుతున్నాయి.