స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వక్కతం వంశీ డైరక్షన్ లో వచ్చిన సినిమా నా పేరు సూర్య. అంచనాలను అందుకోవడంలో విఫలమైన ఈ సినిమా ఆ సినిమా ఫలితం నిరాశ పరచడంతో బన్ని ఆలోచనల్లో మార్పు వచ్చిందని అనుకున్నారు. కాని మళ్లీ బన్ని రిస్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది.


తన తర్వాత సినిమా విక్రం కె కుమార్ తో చేస్తున్నాడు బన్ని. దాదాపు సినిమా కన్ఫాం ఓకే చేశాడని తెలుస్తుంది. అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ మాత్రమే చేయాల్సి ఉందట. విక్రం కుమార్ తో సినిమా అంటే ఓకే అనేలా ఉన్నా ఈ సినిమా బడ్జెట్ గురించి వస్తున్న వార్తలు మాత్రం అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి.


100 కోట్ల బడ్జెట్ తో బన్ని, విక్రం కుమార్ సినిమా తెరకెక్కుతుందట. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా తీస్తారట. తెలుగులో తమిళంలో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న విక్రం కుమార్ తప్పకుండా రెండు భాషల్లో సినిమాను బాగా హ్యాండిల్ చేస్తాడని ఆశిస్తున్నారు.  


ఇక ఈ సినిమా తర్వాత బన్ని త్రివిక్రం డైరక్షన్ లో మూవీ చేస్తాడని తెలుస్తుంది. త్రివిక్రం సినిమా తర్వాత సురేందర్ రెడ్డితో కూడా సినిమా లైన్ లో పెట్టాడట బన్ని. రేసుగుర్రం తర్వాత సూరితో బన్ని సినిమా చేయడం కుదరలేదు ఈసారి మాత్రం తప్పకుండా సినిమా చేయాలని చూస్తున్నాడట.  



మరింత సమాచారం తెలుసుకోండి: