అమెరికాలో వెలుగుచూసి, టాలీవుడ్ లో కలకలం రేపుతున్న హీరోయిన్ల సెక్స్ రాకెట్ లో ఓ చిత్తు కాగితం అత్యంత కీలకంగా మారి మొత్తం వ్యవహారాన్ని బట్టబయలు చేసింది. అక్కడ సాగుతున్న వ్యభిచార దందాపై ఓ పేపర్ లో ఉన్న వివరాలను చూసిన పోలీసులకు అనుమానం రాగా, ఆ వివరాల ఆధారంగానే మోదుగుమూడి కిషన్, చంద్రకళ ఇంట్లో సోదాలు నిర్వహించామని, ఆపై మొత్తం దందా గురించిన సమాచారం బయటకు వచ్చిందని అధికారులు అంటున్నారు.
కిషన్ మోదుగుపూడి వీసా గడువుతీరిన అమెరికాలో ఉండడంతో పోలీసులు అనుమానించి వారిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే అంతకు ముందు అమెరికాలో జరుగుతున్న తెలుగు సంఘాల ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లిన ఓ హీరోయిన్ వేడుక అనంతరం కిషన్ మోదుగుపుడి నిర్వహించే సెక్స్ రాకెట్ లో పాల్గొనేందుకు వెళుతుందనే అనుమానంతో పోలీసులు అరెస్ట్ చేశారని, అనంతరం ఆ హీరోయిన్ చెప్పిన వివరాల ఆధారంగా కిషన్ మోదుగుపుడి, అతని భార్య చంద్రకళ మోదుగుపుడిలను అరెస్ట్ చేశారనే వార్తలు వచ్చాయి. ఈ దంపతులు చేసిన నేరాలపై కీలక ఆధారాల కోసం చూస్తున్నామని, అవి లభిస్తే, విచారణ సులువవుతుందని, శిక్ష పడితే మాత్రం అది పూర్తయిన తరువాత వారిని దేశం నుంచి పంపిస్తామని తెలిపారు.
ప్రస్తుతం వ్యభిచార దందాలో ఆరుగురి పేర్లు బయటకు వచ్చాయని, వీరిని సాక్షులుగా పేర్కొంటామని చెప్పిన అధికారులు, కిషన్ దంపతుల ఫోన్లను విశ్లేషిస్తున్నామని, ఈ దందాలో మరింత మంది ప్రమేయం ఉండవచ్చని అన్నారు. ఇదిలా ఉంటే.. కిషన్ ఇంట్లో సోదాలు నిర్వహించిన యు.ఎస్.బి.పి. అధికారులు అనేక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
వాటిల్లో చేతిఅక్షరాలతో రాసి ఉన్న ఓ చిత్తుకాగితాన్ని పరిక్షించగా ..అందులో మారియట్ హోటల్ పేరుతో ఉన్న కొంతమంది విఠుల ఫోనె నెంబర్లు, రూంనెంబర్లు, పలువురి హీరోయిన్ల పేర్లు ఉండడంతో కిషన్ దంపుతులు సెక్స్ రాకెట్ నడుపుతున్నట్లు తేలింది. వీటిని చూసిన తరువాతే అధికారులు అన్ని ఎయిర్ పోర్టులనూ అలర్ట్ చేసి, అమెరికాలో కాలు పెడుతున్న ప్రతి టాలీవుడ్ హీరోయిన్ నూ సిరీయస్ గా ప్రశ్నించడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో హీరోయిన్ మెహ్రీన్ కౌర్ ని కూడా ప్రశ్నించినట్లు వార్తలు వచ్చాయి.