ప్రముఖ దర్శకులు రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి, బాహుబలి 2 సినిమాల తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా‘సాహో’. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో సుమారు 150 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రం తెరకెక్కుతుంది. హీరోయిన్గా బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ నటిస్తుంది. 50 రోజుల పాటు 250 మంది యూనిట్తో రాత్రిపగలు అనే తేడా లేకుండా అబూదాబిలో షూటింగ్ లో పాల్గొన్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్ర దుబాయ్ షెడ్యూల్ తాజాగా పూర్తైంది.
ఇక 3వ షెడ్యూల్ జూలై 11న హైదరాబాద్ లో మొదలుపెట్టనున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో శ్రద్దా కపూర్ హీరోయిన్ కాగా ఇతర బాలీవుడ్ నటీ నటులు కీలక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. గత ఐదేళ్లుగా ‘బాహుబలి’ప్రాజెక్టులో లీనమైన ప్రభాస్ మరో సినిమా చేయని సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక సినిమా తర్వాత ప్రభాస్ ఎలాంటి చిత్రంలో నటిస్తారనేది అభిమానుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ మూవీతో 2018లో సరికొత్త లుక్తో అభిమానులను అలరిస్తానంటూ కొత్త టీజర్తో ప్రభాస్ ప్రామిస్ చేశాడు. ఈ సినిమాలో హీరోయిన్ శ్రద్దా కపూర్ తో పాటు నీల్ నితిన్ ముఖేష్, ఎవిలిన్ శర్మ, అరుణ్ విజయ్, మందిరా బేడీ, జాకీ ష్రాఫ్ తదితరులు ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. యువీ ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మితమవుతున్న ఈ సినిమాకి బాలీవుడ్ త్రయం శంకర్- ఇషాన్- లాయ్లు సంగీతం అందిస్తున్నారు.