బిగ్ బాస్ సీజన్1 లో కంటెస్టంట్ గా పాల్గొని కాస్త ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు కత్తి మహేష్. పవన్ కళ్యాణ్ అలానే మెగాఫ్యామిలీపై విమర్శలు గుప్పించి సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యాడు.  అంతే కాదు కొత్తగా వచ్చే సినిమాలపై తనదైన కాంట్రవర్సీ రివ్యూలు ఇస్తూ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు.  దాదాపు నాలుగు నెలల పాటు పవన్ ఫ్యాన్స్ తో ప్రతిరోజూ ఏదో ఒక కాంట్రవర్సీ సృష్టిస్తూ..తెగ హంగామా చేశాడు కత్తి మహేష్.  ఆ మద్య ఆయనపై కోడిగుడ్ల తో దాడి జరిగిన తర్వాత పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడానికి వెళ్లిన కత్తి మహేష్ అనూహ్యంగా జనసేన కార్యకర్తలో ఫోటో తీసుకొని గొడవకు స్వస్తి చెప్పారు. 
Image result for kathi mahesh pawan
తర్వాత కూడా పలు మార్లు జనసేన అధ్యక్షుడిపై సంచలన వ్యాఖ్యలు చేసినా ఫ్యాన్స్ పెద్దగా పట్టించుకోలేదు.  ఆ మద్య కాస్టింగ్ కౌచ్ పోరాటం జరుగుతున్న సమయంలో కూడా ఆయనపై ఓ జూనియర్ ఆర్టిస్ట్ ఆరోపణలు చేశారు..తర్వాత గొడవ సర్ధుమణిగింది.  తాజాగా సినీ విమర్శకుడు కత్తి మహేష్‌పై హిందూ జనశక్తి నేతలు కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయన ఓ చర్చా కార్యక్రమంలో శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసి హిందువుల మనోభావాలను కించపరిచారని, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.   
Image result for kathi mahesh pawan
ఓ ఛానెల్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో భాగంగా కత్తి మహేశ్‌ ఫోన్‌ ఇన్‌లో మాట్లాడారు. ‘‘రామాయణం అనేది నాకొక కథ. రాముడనే వాడు దగుల్బాజీ అని నేను నమ్ముతా. ఆ కథలో సీత రావణుడితో ఉంటేనే న్యాయం జరిగి ఉండేదేమో అని నేననుకుంటా’’ అని వ్యాఖ్యానించారని ఫిర్యాదుదారులు తెలిపారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: