యూనివర్సల్ మీడియా బ్యానర్ లో దానయ్య నిర్మించిన సినిమాలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. అయితే కొన్నాళ్లు నిర్మాతగా వెనుక పడిన దానయ్య మళ్లీ భారీ సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఈమధ్యనే భరత్ అనే నేనుతో సూపర్ హిట్ అందుకున్న దానయ్య ఆ వెంటనే రాం చరణ్ తో సినిమా మొదలు పెట్టాడు.


బోయపాటి, చరణ్ కాంబినేషన్ లో ప్రెస్టిజియస్ గా ఈ సినిమా రాబోతుంది. ఇక ఈ సినిమా తర్వాత దానయ్య మరో క్రేజీ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు. మహేష్, చరణ్ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా నిర్మిస్తున్నాడు డివివి దానయ్య. ఈ సినిమాకు దర్శకుడిగా విక్రం కుమార్ పనిచేస్తున్నారు.


నాపేరు సూర్య సినిమా తర్వాత విక్రం చెప్పిన కథ నచ్చిన బన్ని ఆ సినిమాను ఫిక్స్ చేశాడని తెలుస్తుంది. అయితే ఇంకా అఫిషియల్ గా ఎనౌన్స్ చేయాల్సి ఉంది. అసలైతే శేఖర్ కమ్ముల, హరీష్ శంకర్ లతో పాటుగా త్రివిక్రం, సురేందర్ రెడ్డి బన్నితో సినిమా చేయాలని చూస్తున్నారు. 


ఫైనల్ గా మాత్రం విక్రం కుమార్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది. డివివి దానయ్య ఈ సినిమాను ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా తెరకెక్కించాలని చూస్తున్నారట. మహేష్ తో దానయ్య సూపర్ హిట్ కొట్టగా బోయపాటి, చరణ్ మూవీ కూడా హిట్ గ్యారెంటీ అనేలా ఉంది. మరి బన్నితో విక్రం కుమార్ ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.
  


మరింత సమాచారం తెలుసుకోండి: