రాజమౌళి ఐదేళ్ల కల.. తెలుగు సినిమా ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకునే రోజు.. ఇద్దరు హీరోలు ప్రాణం పెట్టి చేసిన సినిమా బాహుబలి. మొదటి, రెండు భాగాలు కలిపి ఎన్ని కోట్లు కలెక్ట్ చేశాయో అందరికి తెలిసిందే. బాహుబలిగా ప్రభాస్, భళ్లాలదేవాగా రానా ఒకరిని మించి మరొకరు తమ నటనతో ఆకట్టుకున్నారు.


ఇక రాజమౌళి దర్శకత్వ ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఆర్కా మీడియా నిర్మించిన బాహుబలి సినిమా తెలుగు సినిమా స్థాయిని పెంచింది.. ప్రభాస్, రానా ఇద్దరు రెండు భాగాలతో ప్రేక్షకులను మెప్పించారు. అవకాశం వస్తే మళ్లీ ఇద్దరం కలిసి చేస్తామని అన్నారు కూడా.


అందుకే దర్శకుడు దశరథ్ ఈ ఇద్దరి కోసం ఓ సూపర్ స్టోరీ తయారు చేస్తున్నాడట. లైన్ బాగుందని తనకు తెలిసిన సన్నిహితులు చెప్పడంతో ఫుల్ స్టోరీ పూర్తి చేసి ప్రభాస్, రానాలకు వినిపించాలని చూస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ సాహో షూటింగ్ లో ఉన్నాడు. రానా కూడా తన సినిమాలతో తాను బిజీగా మారాడు.


దశరథ్ కథ బాగుంటే కచ్చితంగా ఈ ఇద్దరు మళ్లీ కలిసి నటించే అవకాశం ఉంది. ప్రభాస్ తో దశరథ్ మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా తీశాడు. దిల్ రాజు బ్యానర్ లో ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. మరి బాహుబలి, భళ్లాలదేవ మళ్లీ కలిసి చేస్తారా.. ఒకవేళ చేస్తే మళ్లీ హీరో, విలన్ గా నటిస్తారా అన్నది చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: