నాని హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 2 మూడవ ఎలిమినేషన్ కాస్త రసవత్తరంగా సాగింది. మొదట రెండు ఎలిమినేషన్స్ కామన్ మ్యాన్ బయటకు వచ్చేయడంతో ఆడియెన్స్ కూడా బిగ్ బాస్ ఎందుకు ఇలా చేశాడని అనిపించింది. ఇక మూడవ వారం కూడా గణేష్ ఎలిమినేషన్ లిస్ట్ లో ఉన్నాడు. కాని ఫైనల్ గా బయటకు వచ్చింది మాత్రం కిరీటి దామరాజు.


సినిమాల్లో ఫ్రెండ్ పాత్రలు వేసుకుంటూ వస్తున్న కిరీట్ బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోలో ఛాన్స్ రావడం గొప్ప విషయమే అని చెప్పొచ్చు. తన తొందరపాటు వల్ల తనకు బిగ్ బాస్ లో బ్యాడ్ ఇమేజ్ వచ్చేలా చేసుకున్నాడు కిరీటి. ఇక ఎలిమినేట్ అయిన వారితో ఇంటర్వ్యూస్ తీసుకోగా కిరీటి మాత్రం బిగ్ బాస్ మీద ఎలాంటి సంచలన వ్యాఖ్యలు చేయలేదు.


బిగ్ బాస్ లో నాని ఒక్కడే నిజాయితీ పరుడని.. మిగతా వారంతా ఎవరి గేమ్ ప్లాన్ లో వారున్నారని అన్నాడు. ఇక బిగ్ బాస్-2 టైటిల్ గెలిచే సత్తా ముగ్గురు నలుగురికి ఉన్నా పాములతో ఆడుకుని వచ్చిన తేజశ్వికే ఎక్కువ ఛాన్స్ లు ఉన్నాయని అన్నాడు. పాములని ఆడించిన తేజూ బిగ్ బాస్ ఓ లెక్క కాదని అన్నాడు.  


నాని చేతుల్లోనే బిగ్ బాస్ కంటెస్టంట్స్ భవిష్యత్తు ఉందని చెప్పిన కిరీటి. నాని, ఎన్.టి.ఆర్ ల హోస్టింగ్ గురించి కూడా ఎవరి స్టైల్ వారిదని కామెంట్ చేశాడు. అలా పోల్చడం కరెక్ట్ కాదని కూడా అభిప్రాయపడ్డాడు కిరీటి. మరి కిరీటి దామరాజు ఇక ముందు సినిమాల్లో ఎలా రాణిస్తారో చూడాలి.    


మరింత సమాచారం తెలుసుకోండి: