మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదటి రెండు సినిమాలకే మెగా ఫ్యాన్స్ లో ప్రత్యేకమైన అభిమానం సొంతం చేసుకున్నాడు. సుప్రీం, సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాలతో తేజూ కూడా మెగా ఇమేజ్ మోసే హీరోగా క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే ఆ తర్వాత మొదలైంది అసలు కథ.


తిక్క నుండి ఇంటిలిజెంట్ వరకు రిలీజ్ ముందు హంగామా బాగున్నా రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ వెలవెలబోయే పరిస్థితి వచ్చింది. దానితో తేజూ మార్కెట్ కూడా పూర్తిగా దెబ్బతిన్నది. మినిమం గ్యారెంటీ హీరో అనిపించేసిన మెగా హీరో కాస్త డౌట్ ఫుల్ గా తయరయ్యాడు. ప్రస్తుతం తేజ్ ఐలవ్యూ సినిమాతో మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సాయి ధరం తేజ్.


కరుణాకరణ్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను కె.ఎస్ రామారావు నిర్మించారు. ఈ సినిమా 16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయ్యిందట. సినిమా బడ్జెట్ కూడా అంతే ఖర్చు అయ్యిందట. ఏమాత్రం లాభం లేకుండా బిజినెస్ చేశారని తెలుస్తుంది. దాని కారణం తేజూ ఇదవరకు సినిమాల ఫలితాలే కారణమని అంటున్నారు. 


తొలిప్రేమ దర్శకుడు కరుణాకరణ్ చాలా గ్యాప్ తర్వాత చేసిన సినిమా తేజ్ ఐలవ్యూ. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు గోపి సుందర్ మ్యూజిక్ అందించారు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా తేజూని గట్టెక్కిస్తుందో లేదో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: