తెలుగు లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘మహానటి’సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో మహానటి పాత్రలో కీర్తి సురేష్ అద్భుతనటన ప్రదర్శించింది. ఇక బాలీవుడ్ లో ఎన్నో కాంట్రవర్సీలకు కేంద్ర బిందువైన నటుడు సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా ‘సంజు’ సినిమా తెరకెక్కించారు. సంజయ్ దత్ పాత్రలో రణ్ బీర్ కపూర్ అద్భుత నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు.
ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ షేక్ చేస్తుంది. కలెక్షన్లు కూడా దుమ్మురేపుతుంది. అంత గొప్ప సినిమా ఓ యువతికి నచ్చలేదు. ఇంతకీ ఆ యువతి ఎవరా అనుకుంటున్నారా..ఆమె ఎవరో కాదు స్వయానా సంజయ్ దత్ సొంత కుమార్తె త్రిషాలా దత్. గత వారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన బాలీవుడ్ హీరో సంజయ్ దత్ బయోపిక్ 'సంజు' రికార్డులను తిరగరాస్తుంటే, ఆ సినిమా తనకు నచ్చలేదని అంటోంది సంజయ్ దత్ కుమార్తె త్రిషాలా దత్.
సంజయ్ జీవితంలో ఎంతో ప్రాధాన్యమున్న తన తల్లి పాత్రను ఈ సినిమాలో చాలా తక్కువగా చూపించారన్నది ఆమె అభిప్రాయమట. సంజయ్ దత్ కి రిచా శర్మ మొదటి భార్య. వీరికి పుట్టిన అమ్మాయి త్రిషాల్ దత్. సినిమాలో ఆమె పాత్ర నిడివి కూడా చాలా తక్కువ. రిచాశర్మతో విడిపోయిన తరువాత సంజయ్ దత్, మాన్యతను వివాహం చేసుకున్నాడు. అయితే మాన్యతతో త్రిషాలాకు ఎలాంటి విభేదాలు లేవు..కానీ తన తల్లి గురించి ఈ సినిమాలో పెద్దగా చూపించకపోవడం బాధగా ఉందని అందుకే ఈ సినిమా నచ్చలేదని అంటుంది.