అరవింద సమేత దసరా భరిలో దిగడానికి ఇప్పటికే అన్ని రకాలుగా సిద్ధం అవుతుంది. దానికి తగ్గట్టుగానే చిత్ర యూనిట్ సినిమా ను ఫినిష్ చేస్తుంది. అయితే ఈ సినిమా కు సంబంధించి చాలా ఏరియా లలో బిజినెస్ పూర్తి అయ్యింది. అయితే విశాఖ లో ఇంతవరకు కొలిక్కి రాలేదు. దీనికి కారణం లేకపోలేదు. ఓవర్ సీస్ మాదిరిగానే విశాఖలో కూడా చిన్న చిక్కుముడి వున్నట్లు తెలుస్తోంది. అజ్ఞాతవాసి వైజాగ్ ఏరియాను మంత్రి గంటా అల్లుడు ప్రశాంత్ కొన్నారు. ఆ సినిమాకు ఆయనకు అయిదుకోట్లు లాస్ తప్పలేదు.

Image result for aravinda sametha

అందులో సగం అంటే రెండున్నర కోట్లు నిర్మాత చినబాబు భర్తీ చేసారు. అంటే రెండున్నర కోట్ల పోయాయి. అందువల్ల అరవింద సమేత సినిమాను తమకు ఇవ్వమని ప్రశాంత్ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. కానీ అదే వైజాగ్ కు అరవింత సమేత ప్లస్ శైలజరెడ్డి కలిసి 11కోట్లకు పైగా మొత్తానికి బేరం వేరే వాళ్లతో సెటిల్ అయినట్లు వినికిడి. అయితే ఎవరికీ కన్ ఫర్మ్ కాలేదని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. కన్ ఫర్మ్ అయిపోయిందని వైజాగ్ సినిమా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయిపోతే మరెందకు బయట పెట్టడంలేదు అన్నది ప్రశ్న.

Image result for aravinda sametha

అజ్ఞాతవాసి వ్యవహారం దీనివెనుక వుందా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. బ్లాక్ బస్టర్ భరత్ అనే నేను వైజాగ్ ఏరియాకు తొమ్మిది కోట్లకు కాస్త తక్కువగా వసూలు చేసింది. ఇప్పుడు ఈ అరవింద సమేత సినిమాను తొమ్మిదిన్నర కోట్లకు కాస్త అటుగానే చెబుతున్నట్లు తెలుస్తోంది. అయితే బయ్యర్ల పోటీవుంది. అజ్ఞాతవాసి బయ్యర్ కు ఇస్తే కాస్త తగ్గించాల్సి వస్తుందేమో? తెలియదు? 

మరింత సమాచారం తెలుసుకోండి: