పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రం కాంబినేషన్ లో సినిమా అంటే ఆ అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జల్సా, అత్తారింటికి దారేది సినిమాల తర్వాత అజ్ఞాతవాసి వీరి కంబినేషన్ లో ఫ్లాప్ మూవీగా నిలిచింది. ఆ సినిమా తర్వాత పవన్, త్రివిక్రం మధ్య మాటల్లేవు అన్నది అందరి మాట.


కాని రూమర్స్ కు చెక్ పెడుతూ త్రివిక్రం మళ్లీ పవన్ తో సినిమాకు రెడీ అవుతున్నట్టు టాక్. అదేంటి ప్రస్తుతం పవన్ పాలిటిక్స్ లో బిజీగా ఉన్నాడు కదా మరి ఇప్పుడు సినిమా ఏంటి అంటే.. 2019 తర్వాతనే సినిమా కాని ఆ సినిమా మాత్రం ఇప్పుడు అనుకున్నది కాదట. 2014 ఎలక్షన్స్ ముందు అనుకున్న కథ అని తెలుస్తుంది.


రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో రుస్తుం సినిమా 2019 లో పవన్ చేయబోతున్నాడట. త్రివిక్రం ఈ కథ గురించి చాలా రీసెర్చ్ చేసినట్టు ఇదవరకు ఇంటర్వ్యూ లో చెప్పారు. కచ్చితంగా పవన్ తో రుస్తుం సినిమా తీసి తీరుతా అంటున్నాడు మాటల మాంత్రికుడు త్రివిక్రం. ఆయన అంత గట్టిగా చెబుతున్నాడంటే కచ్చితంగా పవన్ కూడా ఓకే చెప్పి ఉండొచ్చని అంటున్నారు.


రుస్తుం కథ రాసుకున్న ఆ సందర్భంలోనే త్రివిక్రంకు ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న అరవింద సమేత కథ రిఫరెన్స్ ఏర్పడిందట . మొత్తానికి పవన్ కథని బ్యాక్ డ్రాప్ తో అరవింద సమేత సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న తారక్ ఈ అరవింద సమేత కూడా పక్కా హిట్ కొట్టడం గ్యారెంటీ అనేట్టుగా టాక్ వినిపిస్తుంది.   


మరింత సమాచారం తెలుసుకోండి: