అలా ఎలా సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన హెబ్బా పటేల్ సుకుమార్ రైటింగ్స్ లో వచ్చిన కుమారి 21ఎఫ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టింది. ఆ సినిమాలో కుమారి అందాలకు యువ కుమారులంతా మనసులో స్థానం కల్పించేశారు. ఆ తర్వాత అదే క్రేజ్ తో అమ్మడు వరుస సినిమాలను చేస్తూ వచ్చింది.


కుమారి 21ఎఫ్ తర్వాత ఆ రేంజ్ హిట్ కొట్టని హెబ్భా మళ్లీ తన అలాంటి సినిమాతోనే కుర్రకారుని వల్లో వేసుకోవాలని చూస్తుంది. హెబ్భా పటేల్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా 24 కిస్సెస్. అయోధ్య డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ఆదిత్ అరున్, హెబ్బా రొమాన్స్ చేస్తున్నారు.  


ప్రస్తుత యువత ఆలోచనలకు తగినట్టుగా ఈ 24 కిస్సెస్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. సినిమా లో 24 కిస్సులు ఉంటాయట. కుమారి లాంటి క్రేజీ బ్యూటీ సినిమాలో 24 కిస్సులతో రెచ్చిపోవడం అంటే ఇక ఆ సినిమా ఏ రేంజ్ లో పాపులర్ అవుతుందో అర్ధం చేసుకోవచ్చు. శాంపిల్ గా టీజర్ రిలీజ్ చేసిన 24 కిస్సెస్ టీజర్ లో మాత్రం ఒక్క కిస్సు చూపించలేదు. 


చూస్తుంటే దర్శకుడు యువతని టార్గెట్ చేసుకుని ఈ సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది. 24 కిస్సెస్ కుమారి హెబ్భా పటేల్ కు మళ్లీ అలాంటి హిట్టే వచ్చేలా చేస్తుందని భావిస్తుంది. మరి కుమారి ముద్దుల్లో తడిసి ముద్దైపోవాలంటే సినిమా వచ్చే దాకా వెయిట్ చేయాల్సిందే. 



మరింత సమాచారం తెలుసుకోండి: