బిగ్ బాస్ 1 జనరంజకంగా సాగింది. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ మొదటి సీజన్ హౌజ్ లో కంటెస్టంట్స్ మధ్య గొడవలు ఉన్నా అంత సీరియస్ గా అనిపించలేదు. అయితే నాని హోస్ట్ గా వస్తున్న బిగ్ బాస్-2లో మాత్రం హౌజ్ లో ఒకరంటే ఒకరికి పడని పరిస్థితి ఏర్పడింది.


ఇక ఈసారి బిగ్ బాస్ లో భామా ప్రేమికులు ఎక్కువయ్యారని చెప్పొచ్చు. గత రెండు వారాలుగా సామ్రాట్ తో తేజశ్వి కలిసి ఉండటం చూస్తున్నాం.. ఇక మరో పక్క తనీష్, దీప్తి సునైనాల క్లోజ్ నెస్ చూస్తూనే ఉన్నాం. హౌజ్ లో ఉన్న అందరితో తమకు ఏమి సంబంధం లేదన్నట్టుగా బిగ్ బాస్ హౌజ్ లో ఈ రెండు జంటలు వ్యవహరిస్తున్నాయి.


అంతేకాదు తేజశ్వి తన సొంత గేం ప్లాన్ తో అందరిని టార్గెట్ చేస్తుంది. ప్రస్తూం నిన్నని నుండి నడుస్తున్న మంచి వారు, చెడ్డ వారు టాస్క్ లో తనీష్ తో కూడా తేజశ్విని గొడవ పడటం తెలిసిందే. ఓ పక్క లవ్, మరో పక్క డ్రామా ఇలా ప్రేక్షకులు కావాల్సిన ఫన్ ఇస్తున్నారు ప్రస్తుత కంటెస్టంట్స్.   


ఇన్ని చేస్తున్నా సరే ఆడియెన్స్ మాత్రం బిగ్ బాస్ చూసేందుకు అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదు. మరి సోదిగా తయారయ్యిందని పబ్లిక్ టాక్. బిగ్ బాస్ ఇది గమనించి వారి మధ్య క్యూరియాసిటీ పెంచే టాస్కులు ఇస్తే బెటర్ అని అంటున్నారు. ఇక ఈ వారం నామినేషన్ లో భాను, దీప్తి, గణేష్ లు ఉన్నారు. ముగ్గురిలో ఎవరు వెళ్తారన్నది కూడా సస్పెన్స్ గా మారింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: