ఆ మద్య కాస్టింగ్ కౌచ్ తో టాలీవుడ్ ను షేక్ చేసిన ఈ భామ.. ఇప్పుడు తమిళ ఇండస్ట్రీపై తన ఫోకస్ మళ్లించిన సంగతి తెలిసిందే.  టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని చెప్పిన శ్రీరెడ్డి కొన్ని ఫోటోలు కూడా లీక్ చేసి అప్పట్లో పెను సంచలనాలు సృష్టించింది.  తన ఉద్యమం పీక్ స్టేజ్ లోకి వెళ్తున్న సమయంలో పవన్ కళ్యాన్ ని దూషించడంతో అంతా రివర్స్ అయ్యింది.  అంతే కాదు శ్రీరెడ్డి కొంత కాలంగా ఇంటికే పరిమితం అయ్యింది.  ఇంటి నుంచే సోషల్ మాద్యమాల్లో పలువురు హీరోలు, దర్శకుల, మ్యూజిషియన్ల పైనే కాదు నటీమణులపై కూడా  సంచలన వ్యాఖ్యలు చేస్తూ వస్తుంది. 

ఇప్పుడు శ్రీరెడ్డి తమిళ ఇండస్ట్రీని ఫోకస్ చేస్తూ..మురుగదాస్, లారెన్స్ లపై సంచలన ఆరోపణలు చేసింది.  తాజాగా  ప్రముఖ నటి కుష్బూ భర్త సుందర్ సిపై శ్రీరెడ్డి దారుణమైన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సుందర్ సి సిద్దమైనట్లు తెలిసింది.  ఇంతకీ శ్రీరెడ్డి ఫేస్ బుక్ లో ఏమని పోస్ట్ చేసిందో తెలుసా! హైదరాబాద్ లో అరన్ మనయ్ షూటింగ్ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ నిర్మాత గణేష్ తో కలిసి వెళ్లి సుందర్ సి ని కలిశాను.
Image result for sri reddy
ఆ సందర్భంగానే తన తదుపరి చిత్రంలో నాకు అవకాశం ఇస్తానని చెప్పారు. ఆ తర్వాత నోవాటెల్ కు రమ్మన్నాడు. శారీరక సుఖాన్ని ఇవ్వాలని అడిగాడు. ఆ తర్వాత ఏదో జరిగిపోయింది’ అని శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ పోస్టు చేసింది.  ఇది కాస్త వైరల్ కావడంతో చెన్నైలో ఉన్న  సుందర్ సీ స్పందించారు. ఆ వ్యాఖ్యల్లో నిజం లేదని స్పష్టం చేశారు. ఆమె చెప్పేదంతా అబద్ధమని కొట్టిపారేశారు. అవాస్తవాలు చెబుతున్న శ్రీరెడ్డిపై కేసు పెడతానని హెచ్చరించారు. ఈ మేరకు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్టు సుందర్ సీ తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: