దిల్ రాజు బ్యానర్ లో వరుసగా మూడు సినిమాలు డైరెక్ట్ చేసిన దర్శకుడు ఇప్పుడు ఆ బ్యానర్ కు దిల్ రాజుకి పూర్తిగా గుడ్ బై చెప్పేశాడని ఫిల్మ్ నగర్ టాక్. ఇంతకీ దిల్ రాజుతో దర్శకుడు గొడవ ఏంటి.. దిల్ రాజు బ్యానర్ నుండి బయటకు వచ్చిన ఆ దర్శకుడు ఎవరు అంటే పూర్తి మ్యాటర్ లోకి వెళ్లాల్సిందే.


షాక్ సినిమాతో దర్శకుడిగా మారిన హరీష్ శంకర్ ఆ తర్వాత ఆంజనేయులు ద్వారా పర్వాలేదు అనిపించుకున్నాడు. దిల్ రాజు బ్యానర్ లో రామయ్య వస్తావయ్య సినిమా తీసిన హరీష్ ఆ సినిమా ఫ్లాప్ అయినా సాయి ధరం తేజ్ హీరోగా వచ్చిన సుబ్రమణ్యం ఫర్ సేల్ తో దిల్ రాజుకి హిట్ ఇచ్చాడు.


ఇక మళ్లీ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో దువ్వాడ జగన్నాథం సినిమాతో క్రేజీ హిట్ అందుకున్నాడు. దిల్ రాజుతో హరీష్ జోడి మంచి పాపులర్ అయ్యింది. అయితే ఈ క్రమంలో హరీష్ రాసుకున్న మల్టీస్టారర్ సినిమా దాగుడుమూతలు దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కించాలని అనుకున్నారు. నాని, శర్వానంద్ లు హీరోగా డిస్కషన్స్ జరిగాయి.


ఈ మధ్యలోనే హరీష్ తో దిల్ రాజుకి మధ్య గొడవ మొదలైందట. హరీష్ మల్టీస్టారర్ మూవీని ఎమోషనల్ డ్రామాగా తీద్దామని అంటుంటే దిల్ రాజు మాత్రం కామెడీ ఎంటర్టైనర్ గా స్క్రీన్ ప్లే రాయమని అంటున్నాడట. ఈ గొడవ పెద్దదవడంతో దిల్ రాజు నుండి హరీష్ శంకర్ బయటకు వచ్చాడని అంటున్నారు. అదే కథతో హరీష్ శంకర్ అనీల్ సుంకర నిర్మాణంలో సినిమా మొదలు పెడతున్నాడని అంటున్నారు.  
 


మరింత సమాచారం తెలుసుకోండి: