బాహుబలి సినిమా తో ఇండియన్ సినిమా స్టామినా ను ప్రపంచానికి తెలిసేటట్టు చేసిన జక్కన అలియాస్ రాజమౌళి తరువాత తీస్తున్న భారీ మల్టీ స్టారర్ మెగా నందమూరి సినిమా మీద ఇప్పటికే అంచనాలు తార స్థాయికి చేరినాయి. రాజమౌళి ఈ సినిమా గురించి ఒక్క మాట కూడా చెప్పకపోయినప్పటికీ మీడియా లో రోజుకొక వార్త షికారు చేస్తుంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు జక్కన కీర్తి సురేష్ ను , పూజ హెగ్డే ను ఫిక్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. 

Image result for kirthi suresh mahanti

మహానటి' చూసిన దగ్గర నుంచి కీర్తి సురేశ్‌ను తన సినిమాలోకి తీసుకోవాలనే ఆలోచనలో రాజమౌళి ఉన్నాడని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అలాగే మరో హీరోయిన్‌గా జిగేల్ రాణి పూజా హెగ్డేను తీసుకోవాలని జక్కన్న అనుకుంటున్నాడట. ఇప్పటికే పూజా హెగ్డేతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని టాక్. త్రివిక్రమ్ మూవీలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే చేస్తోంది కనుక, ఈ సినిమాలో ఆమె చరణ్ జోడీగా కనిపించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇక ఎన్టీఆర్ సరసన కీర్తి సురేశ్ కనువిందు చేయనుందని సమాచారం.

Image result for pooja hegde

 
ఇక ఈ చిత్రం ఎన్టీఆర్, చెర్రీ బాక్సర్లుగా కనిపిస్తారని ప్రచారం సాగింది. కానీ ఈ వార్తల్లో నిజం లేదని ఇప్పటికే చెర్రీ కొట్టిపారేశారు. దాంతో కథా నేపథ్యం ఏమైవుంటుందనే ఆసక్తి అందరిలో పెరిగిపోయింది. ఇక రాజమౌళి మల్టీస్టారర్ కథ బ్రిటిష్ కాలానికి సంబంధించిన నేపథ్యంలో రూపొందనుందనేది తాజా సమాచారం. బ్రిటిష్ కాలానికి సంబంధించిన సామాజిక వాతావరణం, ఆ కాలం నాటి బైకులు, కార్లు ఈ కథలో కనిపిస్తాయని చెప్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: